పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/613

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

ప్రకటం బగు మాయానా
టకసూత్రము నడప నతిదృఢస్థితి గలనే
నొకసూత్రధారుఁడను హృ
ద్వికలత యిఁక నేల విడువుఁడు మీరల్.

117


మ.

బలవత్తేజులు మీర లొక్కరతిఁ దద్బ్రహ్మాండమధ్యంబులోఁ
గలలోకంబులు చూచి సాత్త్వికుల ముఖ్యజ్ఞానులం గాంచి ని
స్తులబోధంబున నూరడించి ఘనముక్తుల్ మెచ్చ నేతెంచి మా
కెలమిన్ నాఁ డెఱిఁగించినప్పుడె మనోభీష్టంబుఁ గావించెదన్.

118


వ.

అని సర్వేశ్వరుం డానతి యిచ్చినఁ దన్నియోగంబునం బరిభ్రమించి
ప్రణమిల్లి స్తుతించి పరమవ్యోమంబునందుండి డిగ్గి యేతద్గుణ
ప్రశంస చేయుచు, బ్రహ్మాండంతస్థలోకంబులు చూచి సాత్వికుల
దుఃఖస్థితియు నసురలసుఖస్థితియుం గనుంగొని మరలి హరిపదం
బున కేఁగి యప్పుడు పరమవ్యూహవ్యోమలోకంబులు గడచి ప్రతీ
చ్యద్వారంబుకడ జయవిజయులు నిజప్రాప్తినివారకులై యుగ్రగదా
ధరులై పరమపురుషాజ్ఞోల్లంఘనంబు సేయుచు నున్నవారలుంబోలె
నున్న వారల నందాత్తసలోకాభిప్రవేశవిహితోద్యములైన వారల
నందోదరసజ్జనార్తిక్షయతత్పరులై యిట్లనిరి: ద్వారపాలకులారా!
ఉచితములైన మామాటలు వినుండా మీరు పరమానందయిత్రైశశేష
త్వమును మీయందు ననుసంధించి యథోచితముగా ద్వారమునందు
నున్నవారు; శేషేచ్చ ననువర్తించి యశేషచేతను లుండందగును;
మీరు స్వోదరావశ్యకార్యార్థస్థితి యిచ్చయించి నట్ల యున్నారు;
శేషియైన భగవంతుని తత్తాదృగిచ్ఛ యుల్లంఘించి యిక్కడ నేటికి
నున్నవారు? విశుద్ధసత్త్వప్రకృతిమాత్రేశాస్త్రైకసంశ్రయమై
రజస్తమోగంధశూన్యమై, ప్రాకృతాగమ్యతేజంబై యున్న యీదివ్య
ధామంబునందు మీకరంబుల నున్న యీగదలకుం బ్రయోజనం
బేమి? శ్రీశదివ్యాయుధాదులకు నాశ్రితావనము నిచ్చట కృత్యము;
సర్వార్తిబీజనాశకమైన యీధామంబున నార్తులైన వారలు లేరు;
క్షేమాభయామృతపదయైన యీధామంబున నజరామరమహాసాల