పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/586

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రూపార్థప్రదస్మేరావలోకను మాకన్నులు దెరచి చూడంగలిగెడు నని
కోరిన మమ్ము ననుగ్రహింపవే యని సనకాదులు విన్నవించినఁ
బ్రసన్నాననుండై సాక్షాత్కృతవిగ్రహుండై భగవంతుం డిట్లనియె:

24

విష్ణువు సనకాదులకు సమాధానము చెప్పుట

సీ.

ప్రథితవేదాంతతాత్పర్యమహానిధి
                       సిద్ధాంజనములై ప్రసిద్ధిఁ గాంచి,
వరసాధుజనసత్వవాక్య మితిజ్ఞాత్వ
                       పిశునంబులై చాలఁ బెంపుఁ గాంచి,
యాత్మీయభక్తిరసార్ద్రంబులై మద
                       ర్థైకప్రయోజనోత్సేక మంది,
యంచితస్వాభావికానవధికనవి
                       శేషత్వకారులై సిరి వహించి,


తే. గీ.

తనరు భవదీయసూక్తిసుధారస
వాహములఁ దృప్తిఁ బొందితి వాంఛ దీర
నో మహాయోగివరులార! యుత్సవంబు
లయ్యె సంతోష మందితి నాత్మలోన.

25


వ.

అని మెచ్చి మఱియు నిట్లనియె:

26


సీ.

అస్మత్ప్రయోజనం బఖిలలోకాభిర
                       క్షణమొ; మీరలు నట్లె కాఁగఁ బల్కి
తిరి; యెవ్వరేని సద్వృత్తి స్వార్థారంభ
                       రహితులై మఱి పదారప్రయోజ
నాసక్తిఁ బొరలుదు రట్టిజనులను మ
                       దాప్తులఁ బోషింతు ననుదినంబు;
స్వార్థపరత్వ మన్యార్థైకవిరతియుఁ
                       బూనిన జడుల దుర్బుద్ధి జడుల


తే. గీ.

నరయ లోకహితార్థంబు నస్మదభిమ
తార్థమును గాఁగ నేఁడు మదగ్రసీమ
నిగ్రహానుగ్రహక్రమనిపుణులైన
ఘనులు మీ రిట్లు పలికితి రనఘులార!

27