పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/534

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


శా.

పారాశర్యమహాముని ప్రవరరూపబ్రహ్మవిద్యాసుధా
పారావారమునందుఁ బుట్టి యతివిభ్రాంతాత్మమోహాంధుఁ బా
తారంభంబునఁ జిక్కి యీశుకకళాధ్యక్షుండు శ్రీవిష్ణుఁడై
యారూఢాధికసంశయుం డనఁగ నర్హం బౌనె వర్తించఁగన్.

99


వ.

అది గావున సంశయ మీరీతి నణఁగు నారీతిగా నాన తిమ్మని మఱియు
నిట్లనియె.

100


సీ.

దేవుఁ డెవ్వరుఁడు తద్దేవునకు రహస్య
                       మెయ్యది యది .... .....
విననయ్యె నెఱింగించి ఘనమోహ మేరీతి
                       నణగు నారీతిఁ జోద్యముగఁ దెలుపు
గురుఁడవు నేఁడు నాకురుశక్తితోఁ బల్కు
                       మశ్రద్ధధానుండు నజ్ఞుఁడును వి
మూఢుండు సంశయాత్ముండు నష్టుఁ డటంచు
                       భక్తాబ్ధిశశిరమాభర్త యనియెఁ


తే. గీ.

గాన నాత్మవినాశైకకారణంబు
మన్మనోదైన్య మణగించు మదిఁ దలంచఁ
దద్రహస్యోపదేశార్ధదాన మొసఁగి
శిష్యుఁడఁ దనూభవుఁడఁ బదసేవకుండ.

101


క.

అని వినుతింపుచు నప్పుడు
తనయుఁడు పలుకంగఁ బలికె ద్వైపాయనస
న్మునివరుఁడు తద్రహస్యా
ర్థనిమిత్తమహోపదేశతాత్పర్యంబుల్.

102

పరబ్రహ్మరహస్యార్థము

మ.

విను మో పుత్రక! యేకచిత్తమున నీవిద్యారహస్యంబు శి
ష్యునకున్ నమ్మిక గల్గు వానికి గురుం డోవున్ బ్రసాదింపఁ బా
వన మస్మత్కులవిత్త మీఘన[1]రహస్యం బీమహావిత్త మో
యనఘా! నీకు లభించుఁ బ్రాప్య మనుభోగ్యంబున్ ఘనంబున్ దగన్.

103
  1. రహస్తం బీ