పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/500

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

శుద్ధాంతఃకరణుండవు
బోద్ధవు నీవంటి పుణ్యపురుషులు గలరే?
యిద్ధరణీతలమున నీ
విద్ధరణితభేరిఁ దెలిపి తేకాదశియున్.

187


శా.

త్రైలోక్యంబున సద్గుణంబులు మహోదారంబులై యుండ భూ
పాలా పూర్ణయశంబు నిల్పి సుతుతోఁ బద్మాక్షితో సంతత
శ్రీలన్ సర్వవికారదూరమయి యర్చిఃకీర్ణమై యాత్మవి
ద్యాలాభాధికమై శుభస్థిరతరంబై యొప్పు మన్మూర్తితోన్.

188


వ.

నీవును సుతుండును నిల్లాలును సమగ్రైశ్వర్యతేజంబుల నైక్యంబు
నొందుం డనిన.

189

రుక్మాంగదుఁడు సపుత్త్రకళత్త్రముగా ముక్తి పొందుట

సీ.

అప్పు డైహికసుఖంబంతయు విడనాడి
                       కోశమందిరధారకుంజరహరి
వస్తువాహనబంధువర్గంబు దిగనాడి
                       యైక్యంబు నొందఁ బో రనుచుఁ గురిసె
మందారతరుకుసుమంబులు, దివ్యదుం
                       దుభులు మ్రోయ నుతించి రభిమతముగ
నప్సరోంగనలు, చోద్యంబుగాఁ బాడిరి
                       గంధర్వవరు లుత్కంఠ మెఱయ


తే. గీ.

నది నిరీక్షించి యంతకుం డంతలో లి
పిప్రమార్జన మొనరించి బెగడి దిశలు
గ్రక్కతిల మొఱ్ఱలిడి యధికార మొల్ల
ననుచు సాగిలి మ్రొక్కి, యి ట్లనుచుఁ బలికె.

190


వ.

చక్రధరా! యీమోహిని నేకాదశీవ్రతభంగంబు గావింపఁ గుశకే
తుండు నిర్మించిన వాఁడే తత్ప్రభావంబున సతీసుతసహితుండై నీ
యందు నైక్యంబు నొందె, నాలోకంబు రహితనానాలోకం బయ్యె.
నీ వెఱుంగనిది యెయ్యది? యని విన్నవించి కమలాసనుకడ కేఁగి
విన్నవించిన దివ్యవిమానంబులతో నింద్రాదులు చుట్టునుం గొలిచి రా
నవ్విధాత యెండిననదివోలెఁ, జంద్రుండు లేని శర్వరివోలె, వాడిన
పంకజంబువోలె, నివృత్తమఖంబైన వేదికయుంబోలె, ద్రుమంబులు