పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


మ.

ప్రణతాత్మానుజనైకరక్షణవిలంబప్రాసహత్వంబు స
ద్గుణు లీక్షింపఁగఁ జూపుకైవడి ముకుందుం డాత్మహస్తంబులన్
బ్రణుతస్పూర్తి వహింపఁగా వెలయు తత్పంచాయుధిం గొల్తుఁ గా
రణమై నిత్యశుభంబు లిచ్చి నను సంరక్షింప నేవేళయున్.

6


సీ.

ధరణి వేదంబులు ద్రావిడంబుగఁ జేయు
                     శ్రీ పరాంకుశయోగిశేఖరులను
సకలసమ్మతమతస్థాపకుండైన శ్రీ
                       భాష్యకారుల రంగపతికి నున్న
తావరణములు దివ్యారామము నొనర్చు
                       ఘనుల, గోదాహ్వయకన్య నొసఁగు
యతిశిఖామణి, నిటలాక్షుఁ బాదాక్షిచేఁ
                       దర్జించు గురుకులోత్తంసు నియమ


తే. గీ

పరుల భూతనరోమహద్భట్టినాథ
ముఖ్యులగువారి నాళ్వారి మున్నవారి
తోత్సవంబున సేవించి యోగ్యతాభి
రామమూర్తుల వైష్ణవాగ్రణులఁ గొలుతు.

7


ఆ. వె

రామకృష్ణకీర్తిరత్నశాణనికష
కల్పితోక్తులయిన ఘనులఁ బుణ్య
తనుల మాన్యసత్యతనుల వాల్మీకి ప
రాశ రాత్మబవులఁ బ్రస్తుతింతు.

8


చ.

పొరిఁ బొరిఁ గాళిదాస భవభూతి మురారి మయూర బాణశం
కర జయదేవ మాఘముఖ కావ్యుల భవ్యుల సంస్కృతోక్తిబం
ధురరచనాధురంధరులఁ దోయజమిత్రసమానమూర్తులన్
సరసుల లక్షణజ్ఞులఁ బ్రసంగగుణజ్ఞుల సన్నుతించెదన్.

9


ఉ.

ఎన్నిక భారతీయకథలెల్ల సమంచితగోస్తనీరసా
చ్ఛిన్నధునీఝరంబులుగఁ జిత్రముగా రచియించి లోకముల్
సన్నుతి సేయ నాంధ్రపదచాతురి నిల్పిన సత్కవీంద్రులన్
నన్నయభట్టుఁ దిక్కకవినాథుని నెఱ్ఱనమంత్రిఁ గొల్చెదన్.

10