పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/560

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

494

ద్విపద భారతము


భావింప మఱియు నీపౌరోహితుండు
భావజ్ఞుఁడే యెన్ని భంగులయందు?
జననుత, నీయజ్ఞసంఘంబులందు
ననఘ, యేమఱకుండునయ్య యాజ్ఞికుఁడు?
రణధురీణుల వితరణ గుణాకరుల
గణనకునెక్కిన ఘనయశోధనుల
మానుగా నీవు నమ్మఁగఁజాలువారి
సేనాధిపతులుగాఁ జేసితివయ్య?
పలుప్రధానులఁగూడి బలవంతులయ్యు
నిలఁ బక్షపాతులై యిలనాథసుతులు
ధనగర్వములను మదంబొందకుండ
ననిశంబు మెలపుదువయ్య నెయ్యమున?
వేద శాస్త్ర పురాణ విద్యలయందు
భూదేవులొనరిరె పూనినకడను?
రోగంబులెల్లను రూఢిగా మాన్పు
నాగమవేదులు నమృతహస్తులును
అగువైద్యులను నృప, యర్థిఁ బ్రోచితివె?
జగతీతలేశ్వర, సద్గుణాంభోధి!
మఱియును నుత్తమ మధ్య మాధముల
నెఱిఁగి రక్షింతువే యెపుడువారలను?
కొలిచినవారికిఁ గోరి జీతముల
నలయింపకిత్తువే యాదరంబునను?
త్రాణతో మూలభృత్యశ్రేణి మనుపఁ
బ్రాణంబులిత్తురు భండనంబునను;
పరికింపఁగాఁ జోరభయవర్జితముగ
ధరణిఁబాలింతువే! ధనలోభమునను
దండి నేలవుగదా తస్కరావళిని?
మండలంబునఁగల మహిత తటాక