ఆది పర్వము
47
విచ్చేసి, యంబికావిభుఁ డుగ్రభంగి
వచ్చునాగరళంబువలను వీక్షించి,
నవ్వుచు నప్పుడు నతపాణిపద్మ
మవ్విషమున కెదురగునట్లు చాఁపఁ,
బరికించి విరిదమ్మిపైవ్రాలు తేఁటి
కరణిఁ దద్విషము తత్కరముపై వ్రాలె.
అంగజాంతకుఁ డప్పు డవ్విషానలము
నంగదఁ గబళించి యడరి మ్రింగుటయు,
భువనంబు లలరె ; నప్పుడు వారలెల్ల
శివుఁ బ్రశంసించిరి చెలఁగి పల్మాఱు .
అవలీల వెండియు నసురులు సురలు
జవము దీపింప నాజలరాశిఁ దరువ,
ఐరావతాద్యుత్పత్తి
సురపతిప్రముఖులు చూచి మోదింప
గరిమతో నప్సరల్ గనుపట్టి; రంత
నైరావతము, దేవహయమును, గల్ప
భూరుహపంచకంబును, సుధాకరుఁడుఁ
ద్రిదశేంద్రధేనువు, దివిజరత్నంబు
ముదముతోఁ గౌస్తుభంబును దోడుతోడ
నుదయించె; హరికృపనొందినవారి
కొదవుసంపద లిప్పు డొదవినకరణి,
సొరిది శృంగారవిస్ఫురణ రెట్టించి,
కరమునఁ బూదండఁ గడఁక ధరించి,
కరుణరసం బర్థిఁ గనులధరించి
.........................................
పాలిండ్ల కొఱపుగాఁ బైఁట గీలించి,