ఈ పుట ఆమోదించబడ్డది
రేకు: 0299-01 శంకరాభరణం సం: 03-572 శరణాగతి
పల్లవి:
తన చిత్తము కొలఁది తమకించ నిఁకనేల
మనసు వచ్చినప్పుడే మన్నించీఁ గాక
చ. 1:
కొండలందు నదులందుఁ గోరి యాకసాన భువి
నిండియున్నాఁడు తొలుతే నీలవర్ణుఁడు
అండనే నాయందు లోకులందు నుండుటరుదా
గండికాఁడై తన మాయ గాననీఁడుఁ గాక
చ. 2:
గాలియై పంచమ(?) వాద్యగతులై శబ్దములై
ఆలకించి పలికీని యాదిమూరితి
నాలుక కొననే వుండి నానాభాష లాడీని
కాలముతో నెదిరికిఁ గాననీఁడుఁ గాక
చ. 3:
వేదమందు శాస్త్రమందు వేవేలు వాదములందు
పాదుకొని బోధించీఁ బరమాత్ముఁడు
యీదెసనే శ్రీవేంకటేశుఁడై పొడచూపె
గాదిలి తన దాసులఁ గరుణించీఁ గాక