ఈ పుట ఆమోదించబడ్డది
రేకు: 0237-03 భూపాళం సం: 03-212 అధ్యాత్మ
పల్లవి:
పరమయోగీశ్వరుల పద్ధతి యిది
ధరణిలో వివేకులు దలపోసుకొనుట
చ. 1:
మొదల నాత్మజ్ఞానము దెలిసి పిమ్మట
హృదయములోని హరి నెరుఁగుట
వుదుటైన యింద్రియాల నొడిసి పంచుకొనుట
గుదిగొన్నతనలో కోరికె లుడుగుట
చ. 2:
తన పుణ్యఫలములు దైవము కొసగుట
పనివడి యతనిపై భక్తిచేసుట
తనివితో నిరంతర ధ్యానయోగపరుఁడౌట
మనసులోఁ బ్రకృతిసమ్మంధము మరచుట
చ. 3:
నడుమ నడుమ విజ్ఞానపు కథలు వినుట
చిడుముడి నాచార్యసేవసేయుట
యెడయక శ్రీవేంకటేశుపై భారమువేసి
కడు వైష్ణవుల కృప గలిగి సుఖించుట