పుట:తాలాంకనందినీపరిణయము (49-64పుటలు).pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము 53


వచ్చినభావ మేర్పడె సుభద్రను రాముఁడు రాజరాజుకే
నిచ్చెద నన్నవాఁడు సతి నేగతినైనను నీకె గూర్చెదన్.

226


క.

అన విని వనజనయను మన
మున తనునెనరెనయ నునిచి మునుపనుకొనురీ
తిని వనిత నెనయు చనువును
వెనుకొను కపటత్రిదండి వేషము దాల్చెన్.

227


సీ.

భుగభుగవాసించు మృగనాభిఁ దుడిచి స
     ద్విమలమృత్స్నోర్ధ్వపుండ్రమును దీర్చి
పుటపాకగాంగేయపటము సడల్చి కా
     షాయవస్త్రము గటిస్థలి ధరించి
జ్యావల్లికాటంక్రియావిధాయకమైన
     దక్షిణపాణి త్రిదండ మూని
గాండీవగుణకిణాంకంబైన డాకేల
     సలిలపూరితకమండలువు దాల్చి


తే.

వీరరసమెల్ల నిర్జించి విమలశాంత
రసము నేకీభవించి తారసిలునట్లు
ఘనజగన్మోహనాకారుఁ డనఁగ నెగడు
విజయుఁ డవ్వేళఁ దాపసవేషి యయ్యె.

228


క.

చెలులవిడి సన్న్యసించుట
లిలలో సహజం బటందు రీ చెలికై యా
శలఁ జెంది సన్న్యసించఁగ
నలవడి యర్జునుఁడు రైవతాద్రికిఁ జేరెన్.

229


క.

ఈవిధి రైవతకాద్రివ
నీవాటిం జేర్చి మౌననియమముచే ధా
త్రీవరతాపసవేషసు
ధీవరమతి నుండు మనుచుఁ దెలిపి హరి జనెన్.

230