Jump to content

పుట:తాలాంకనందినీపరిణయము (49-64పుటలు).pdf/1

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము 49


చ.

పులినశ్రీకటి మీనలోచన లసత్ఫుల్లాంబుజాతాస్య యు
జ్జ్వలచక్రస్తని జీవనభ్రమణభాస్వన్నాభి చక్రాంగమం
జులయాన త్రివళీతరంగ మధులిట్ శుంభత్కచాబంధ కో
మలబింబాధర కృష్ణవేణి హరిరామాయీ నదీయైనదో!

203


వ.

అని వినుతింపుచు.

204


క.

అటు తటుకున వెడలి మహో
త్కట శుభద మహోబలంబు గని గడఁచి రుచి
స్ఫుట పటల దిక్తటము వేం
కట మహిభృత్కటకమణినికటమున విడిసెన్.

205


ఉ.

శ్రీ తిరువేంగఁడప్పని భజించి పదంపడి కాంచికాపురీ
నీతనతాదరు న్వరదునిం గని మ్రొక్కి కవేరకన్యకా
శీతల వీచికా తుషిత చిత్త సనాథుని రంగనాథు న
త్యాతుర భక్త పూజ లిడి యవ్వల సేతువు గాంచి వేడుకన్.

206


తే.

శ్రీ ధనుష్కోటి స్నానంబుఁ జేసి వెడలి
పదియు మూఁడవ నెలకు నప్పాండుసుతుఁడు
మహిని మలయధ్వజుం డేలు మణిపురమ్ము
చెంత నొక్కెడ నుపవనసీమలోన.

207


ఉ.

రంగదనంగమంగళతురంగి మెఱుంగుల మేలితావి సం
పంగి విలోలలోచన విధంగిత బాలకురంగి మోహనా
పాంగి కళానుషంగి రుచిరాబ్ధితరంగి మనోహరాంగి చి
త్రాంగద పేర నొప్పు మలయధ్వజు కూతురుఁ గాంచె దవ్వులన్.

208


సీ.

కనుఁగొన దళుకు తళుక్కని దృష్టి లోఁదోఁచ
     ఘనతటిల్లతిక యంచును దలంచు