పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/660

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంధ్రభారతసంగ్రహము

క. మఱునాఁ డెప్పటియట్ట్టుల
     యఱిముఱిఁ బఱతెంచి దండులాలముసేయం
     దరలుడు శిఖండి మున్నిడి
     పఱతెంచెనుగ్రీడి భీఝ్మపయికిఁ గడంక౯.

తే. అడ్డుపడి దుస్ససేనుఁడు హామికలరం
      బెక్కుమాఱులు కవ్వడి బెగ్గడిలఁగఁ
     బోరిపాఱె శిఖండియుఁ బొంగియేయఁ
     జొచ్చెవివ్వచ్చుప్రాపునఁ జొరవమిగుల.

క. కొడుకుంబంచెను ద్రోణుఁడు
     వడిఁగ్రీడికి నడ్డుపడఁగ బరవసమునఁగ
     వ్వడి తెఱపిఁజేసి యమ్ముల
     బడలించె శిఖండివెనుక వదిగొని భీఝ్మ౯.

తే. తేరుసమసియు భీఝ్మండు దిటవుచెడక
     విరటుతమ్ముశతానీకుఁ బిలుఖమార్చె
     నంత వివ్వచ్చుఁడలుగులనక్కజముగఁ
     బొదివిపడవైచె నాతనిఁ బుడమిమీఁద.

తే. నేలఁబడియున్న భీఝ్మనిపాలికేగి
     యంపసెజ్జయుఁ దలగడ యతనికపుడు
     క్రీడినేర్పుమైఁ గలిగించి వాఁడితూపు
     నేలలోనాటి దగ మాంనె నీరుదీపి.

క. మనుమలు మొదలగువారలు
     తనచుట్టును బలసియుండఁ దనరెడు నాభీ
     ఝ్మనిసాలికిఁ గర్ణుండును
     జనుదెంచికరంబు వేఁడెసై రణచూపన్.