పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సరణం. ఇది రెండో అంక ప్రారంభం ఆగిపోయింది. ఆంగ్ల వచనానికి మిక్కిలి చేరువైనా బ్లాంక్ వర్సులో ఆ నాటకం పుట్టి ఉండడం వల్ల, తెలుగు వచనానికి మిక్కిలి చేరువగా ఉండే ద్విపదలోకి దాన్ని దింపడం కర్తవ్యం అని కర్త ఊహించి ఉండవచ్చును. ఈ నాటకమూ, మర్చెంట్ ఆఫ్ వెనీస్ అనే నాటకమూ, విక్టోరియా రాణి చరిత్రా - ఇవి కర్తకు చాలా ఇష్టం. ఈ విషయాల్ని ఆయన రెండు మూడు విధాలా రూపించడమే అందుకు నిదర్శనం.

తక్కిన పద్యరచనలలో అయిదు హేళనలు. 'సరస్వతీ నారద విలాసము'లో కవులంతా తనకి అలంకారాలు చేయించాం అంటూ మొదలెట్టి తనని సకల హింసా పెడుతున్నారని సరస్వతి అడివిలోకి వెళ్లి అరణ్యరోదనం చేస్తూంటే, నారదుడు గానం అంతా వేశ్యల పాలైందని విచారిస్తూ అక్కడికే వెళ్లి దైవాద్వా ఆవిణ్ణి కలుసుగుని తానెంత దుఃఖంలో ఉన్నా ఆవిడ తన తల్లి గనక ఆవిణ్ణి ఎత్తుగుని అడివి దాటిస్తానంటాడు. 'స్త్రీ పునర్వివాహ సభా నాటకము' లో వీరభద్రుడు గారు పెద్దల్ని సభకి రప్పించే నిమిత్తం స్నేహితుడితో ప్రసంగిస్తాడు. 'వీర' పదం పేరులో ఉన్న ఆ పాత్ర, కర్తే! చివరకు ఇద్దరూ కలిసి ఒక కీర్తనలో ఈశ్వర ప్రార్ధన చేస్తారు. 'స్త్రీ విద్య' అనే పద్య సంపుటి ఏమిటంటే, స్త్రీ విద్య కూడదనే వారు పద్యరూపంలో వాదన చేయగా, గర్భసీసాలలోనూ, బంధకందాలలోనూ వ్యవహరిస్తూ ప్రమాణం కూడా చూపించి స్త్రీ విద్య శాస్త్రసమ్మతం అని 'గద్య తిక్కన' తక్షణం పంపిన సమాధానం! వితంతు వివాహాలు జరిగిపోయి, సంఘంలో వితంతువులు దొరక్కుండా పోతే తమరికి చాలా విషయాల్లో తంతు నడవక బాధ కలుగుతుంది కదా అని వాపోయే వాళ్ల బేసబబులు 'కులాచార పూర్వ నాగరిక పంచరత్నములు' అనే పద్యసంపుటీలో ఉన్నాయి. 'హితబోధ' అనేది పద్యత్రయం. విమర్శకి ఆగలేక, కాఱులు ప్రయోగిస్తూ, చాలామంది చేత పొగిడించుకుంటే మాత్రం ఎవడేనా కవి కాగలడా? లక్ష మంది పొగిడినా శునకం సింహం కాగలదా! అని దానిలో బోధ. వీరేశలింగం రచనల్లో ఒకే ఒక విమర్శ ఉండడం నించి ఇది ఎవర్ని ఉద్దేశించి పుట్టిందో తెలుస్తూనే ఉంది.

'చెన్నపురి బ్రహ్మోపాసన మందిర ప్రతిష్ఠాపనము' అనేది బ్రహ్మసమాజ మత స్థాపక పోషక సంస్కర్తల ప్రశంస. తమరి పత్రికని వర్ధిల్లజెయ్యడానికి సర్వరక్షకుణ్ణి వేడుకుంటూ రచించుచున్న పద్యావళి 'దైవప్రార్థన' కర్తకి మిక్కిలి ఇష్టవిషయమైన 'విక్టోరియా రాణి' గురించిన మెప్పు - 'శ్రీ విక్టోరియా జూబిలీ నవ--AvinashVellampally (చర్చ) 15:51, 2 డిసెంబరు 2014 (UTC)