పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/334

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యరాజాపూర్వదేశ యాత్రలు

గల నల్లని దిగంబర పురుషవిగ్రఁహ మొకటి నాపంక నడిచి రానారం భించెను. ఆఘోరరూపము నాకంటఁబడఁగనే పురాణములలో వర్ణింపబడిన రాక్షసుల రూపములును కధలును స్మరణకువచ్చి యది తప్పక రాక్షస దేశమని ఆక్రూర రాక్షసుని నాఁటిసాయం కాల భోజనమునకు నేనే ప్రధమ కళము నగుదుననియు తోఁచి నామనస్సులో నానా విధములైన యూహలుత్పన్నములు కానారంభించినని. నేను కన్నులెత్తియా వికృతవిగ్రహమువంకఁజూచునప్పటికి ముందుగా పెద్దగొడుగంతయున్న యాభీకం ముఖమునందు నిప్పుబంతులవలెనున్న తెల్లని వ్రేలెడేసిముని పండ్లు భయంకరముగా గానఁబడి నాదృష్టిని మిఱుమిట్లు కొల్పిననవి.అంతట నే నాఘొరాకారమును జూడలేక కన్నులు మూసికొన్నాను. కాటుక కొండవలె నడిచివచ్చు యావి గ్రహము నమీపింపఁగానే నాదేహము పిలుపునచెమర్చి కంపమెత్తి నది; నాలుకతడఁబడి నోట మాట రాకపోయినది; భయపడి ప్రాణములెక్కడకు లేచిపోయినవోకాని దేహస్మృతి సహితము తప్పిపోయినది. ఆక్షణమున నేను మూర్చలోమునిఁగి శవమువలెనయి మొదలునఱికిన వృక్షమువలె క్రిందపడిపోయినను. అటుపొమ్మట నక్కడ నేమిజరగినదోనాకు తెలియదు. నా ప్రాణములెంత సేపటికి మరల వచ్చి నాబొందిలో చేరుకొన్నవోనేను నిశ్చయముగాచెప్పిలేనుగాని యని చేరినపిమ్మట నేను కన్నులు విచ్చివ్హూవ్హునప్పఋఇకి నేను మునుపున్నచోట లేక భూమి కిరు పదియడుగుల యెత్తున చెట్టుక్రింద నాకగపడిన రాక్షసునియొక్క రెండవ చేతి వ్రేళ్ళు రెండు నానడుమును చుట్టుకొని యు న్నవి.నాతొడలకంటె నెక్కువలావుగా