పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ష్యులువచ్చి,"మీయన్నగారు పిఠాపురము నుండివచ్చి యావలి వీధిని కరణముగారి యింటిలోఁ గూరుచుండి నిన్నక్కడకు దీసికొని రమ్మన్నాడు" అని చెప్పి సీతను దీసికొని పోయి యూరిబయ నుండి యత్తుకొని పాఱిపోయిరి. ఈదు:ఖవార్త మాణిక్యాంబకుఁ దెలిసిన తోడనే యామె భూమిమీఁదపడి మూర్చపోయి కొంతసేపటికి దెలిసి పెనిమిటి యొక్క వియోగమునకుఁ బుత్రికాశోకము తోడుపడ నెవ్వనెన్ని విధముల జెప్పినను మానక కన్నీరు కాలువలు గట్ట విలపించు చుండెను.