పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ఎనిమిదవ ప్రకరణము

రాజ- ఎవ్వరోమనుష్యులక్కడ తొందర పడి పరుగెత్తుచున్నారు; వారిలో నెవ్వరికైన నొకయాపద వచ్చియుండఁబోలును!శీఘ్రముగా వెళ్ళుదము రండి.

అని వేగముగ నడచివారు మనుష్యుల కలకలములువునఁబడుచున్న ప్రదేశమునకు సమీపముగాఁబోఁగా, మార్గమునకుఁగొంచెముదూరములో దక్షిణపుదిక్కున మూగియున్న గుంపులో నుండి "శుద్ధిచేయుటకు మజ్జిగ" యని కేకలువేయుచు కొందఱుపరుగెత్తుకొని వచ్చుచుండిరి. రాజశేఖరుఁడుగారు వాండ్రను జూచియీసందడి యేమని యడుగఁగా, వారిలో నొకగొల్లవాఁడు 'రాచకుమారుఁడొకఁడువడగొట్టి యారావిచెట్టుకిద పడిపోయినా' డని చెప్పెను.

రాజ- మీ రాతనిగొంతుకలోఁ గొంచెము నీళ్ళుపోయలేక పోయినారా? గొల్ల- మొట్టమొదట మేము నీళ్ళియ్యఁబోఁగా, శూద్రులము కాఁబట్టి మాచేతినీళ్ళు త్రాగనని యారాజు పుచ్చుకొన్నాఁడుకాఁడు. తరువాత దాహమునకు తాళలేక మాచేతి నీళ్ళు త్రాగుట కొప్పుకొన్నాడుఁ. కాని మావారిలో పెద్దవాఁడు వచ్చి శూద్రుఁడు రాజునోటిలో నీళ్ళుపోసిన పాపమువచ్చునని చెప్పునీళ్ళు శుద్ధిచేయుటకై మజ్జిగనిమిత్తము మమ్ముఁబంపినాఁడు. మాపల్లె ఇక్కడికి పావుక్రోసుదూరమున నున్నది. మీరుబ్రాహ్మణులుగాఁ గనఁబడుచున్నారు. మీవద్ద నేమయిన మంచితీర్ధ మున్నయెడల, వేగిరము పోయి యాతనిగొంతుకలో నాలగుచుక్కలుపోసి పుణ్యము కట్టుకొనండి.

ఆమాటలువినిరాజశేఖరుఁడుగారురిక్మిణిచేతిలోనున్నమంచినీళ్ళచెంబునుపుచ్చుకొని,చెట్టుదగ్గఱకుపరుగెత్తిపోయిగుంపులోనుండి