పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వాలునుంగా నిలుపవలయునండ్రు. మఱియుఁ గొన్నిమతంబుల
వార లీ పంచాంగవ్యూహంబునకే యంగంబున కొక్కొక్క
యనీకంబు లెక్క ననీకంబు లైదింటికి ముందర జగడంబు సేయు
వార లాఱునూట డెబ్బదియైదుగురు వీరభటులును, నిన్నూట
యిరువదియైదు గుఱ్ఱంబులును, నలువదియైదేనుంగులును నిట్టులె
పాదసంరక్షణార్ధబలంబునుం గూడి వేయినిన్నూట యేబదిసంఖ్య
గల వీరభటులును, నన్నూటయేబది గుఱ్ఱంబులును, దొంబది
యేనుంగులునుం గలిగి యుండవలయు నండ్రు. వెండియు
బృహస్పతిమతంబు వార లీపంచాంగవ్యూహంబుననే రక్షభాగం
బులు రెండునుంగూడి సప్తాంగంబులం బ్రవర్తిల్లు నందు రందునకుం
గల బలంబు నాలుగుపా ళ్ళొనరించి యురోభాగంబుల నొకపాలును,
గక్షబాగంబుల నొకపాలును, పార్శ్వభాగంబుల నొకపాలును,
మధ్యపుచ్ఛబాగంబుల నొకపాలునుంగాఁ బన్ని జగడంబు
సేయించవలయు నం డ్రందు.

71


సీ.

తమలోనఁ దాము సందడిపడి కలయక
             యని యొనర్పఁగఁ దగు నదియుఁ గాక
కలిసి పోరాడ సంకులసమరం బగు
             నట్టి సందడికయ్యమందు నెల్లఁ
దమయేనుఁగులదండఁ దాఁగొని జగడంబు
             సేయఁగావలయు నజేయలీలఁ
దమమూఁకమీఁద గుఱ్ఱములు పైకొన్నచో
             నొండొరుల్ చెదరకయుండి పోర


గీ.

వలయు బాణంబులును దుపాకులును విండ్ల
మూఁక ముందర నిడికొని మొనకు నడచి
యెట్టి మూఁకలు బైకొన్న నట్టిమూఁక
చేతఁ బోరింపవలయును క్షితివరుండు.

72