పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


గీ.

పడఁతిరూపున మును సహ్యబలునిఁ జంపె
మహిని భీముండు మానవమాయచేత
నలుఁడు ప్రచ్ఛన్నరూపుఁడై కొలిచె దేవ
మాయఁగై కొని ఋతువర్ణమనుజవిభుని.

173


గీ.

అవని నన్యాయమును బోరు వ్యసనములును
నడరుచుండఁ బ్రవర్తించు నట్టివాని
నరసి మాన్పక యుండిన నగు నుపేక్ష
యిదియు మూఁడుదెఱంగులై యిటుల వెలయు.

174


సీ.

కామాంధుఁడై ముందు గానక గర్వించి
            ద్రౌపదిపై కాంక్ష దనరుసింహ
బలుని భీముఁడు రేయి పట్టి వధింపుచో
            విరటుఁ డుపేక్షించి విడుచుటయును
మునుపు హిడింబుఁ దా మోహించి భీమును
            వరియించి యతనిపై వాంఛఁ జేసి
తనతోడఁబుట్టిన దనుజు హిడింబుని
            నురక యుపేక్షించి యుండుటయును


గీ.

ననఁగ నీగతి నన్యాయమైన యెడల
వ్యసనములయెడ జగడంబు వచ్చునెడల
నగు నుపేక్షింపఁ దనవారినైన నెందు
నీతిమార్గం బెఱిగిననృపవరుండు.

175

ఇంద్రజాలప్రకారము

సీ.

ఘనముగా మాయచే గట్టులు చీఁకట్లు
            బెనువాన లగ్నిఁగల్పించుటయును
దవ్వుల నున్నతధ్వజములు గలిగిన
            సేనలఁ గన్పడఁ జేయుటయును