దివ్యదేశ వైభవ ప్రకాశికా/మణిమాడక్కోయిల్

వికీసోర్స్ నుండి

30. మణిమాడక్కోయిల్ 30 (తిరునాంగూర్)

(శీర్గాళి - వైదీశ్వరన్ కోయిల్ 10 కి.మీ)

శ్లో. భాభాతి దివ్య మణిమాడ పురే సురేంద్ర
   రుద్రాభిధాన నళినీ ద్వయ శీభమానే|
   శ్రీపుండరీక లతికా మహిషీ సమేతో
   నన్దా ప్రదీప భగవానితి నామధేయ:||

శ్లో. ప్రాచీముఖాసనలసన్ ప్రణవాభిధాన
   వైమాన వాస రసిక శ్శ్రిత పారిజాత:|
   ఏకాదశేశ మఘవన్నయనాను భూత
   శ్రీమత్కలిఘ్న మునిపుజ్గవ కీర్తిత శ్రీ:||

వివ: నందా విళక్కు పెరుమాళ్(నరనారాయణర్)-పుండరీక వల్లి తాయార్-ఇంద్ర పుష్కరిణీ-రుద్రపుష్కరిణి(ప్రణవాకార విమానము)-తూర్పు ముఖము-కూర్చున్న సేవ-ఏకాదశరుద్రులకు, ఇంద్రునకు(మాతంగ మహర్షికి)ప్రత్యక్షము-తిరుమంగై ఆళ్వార్లు కీర్తించినది.

విశే: మకరమాసము అమావాస్య(తై అమావాస్య) నాడు జరుగు 12 గరుడ సేవలను సేవించియే తీరవలెను. తిరునాంగూర్ తిరుపతులలో నిదిమొదటిది. మిగిలినవి వై గున్ద విణ్ణగరం. అరిమేయ విణ్ణగరం, వణ్ పురుషోత్తమం, శెంబొన్‌శెయ్ కోయిల్; తిరుతైట్రి యంబలమ్‌, ఈ సన్నిధిలో తిరుక్కోట్టియూర్ నంబి(గోష్ఠీపూర్ణులు) వేంచేసియున్నారు. అర్చకస్వాములను ముందుగా కలసికొని సేవింపవలెను. మేషం చిత్తా నక్షత్రము తీర్థోత్సవముగా బ్రహ్మోత్సవము జరుగును. శీర్గాళి నుండి టౌన్ బస్ కలదు. రామానుజ కూటం గలదు. మిగతా భోజనాది విషయాలు సన్నిధిలో ఏర్పాటు చేసికోవాలి.

ప్రతి సంవత్సరము మకర మాసము అమావాస్య దినమున తిరుమంగై ఆళ్వార్లు తిరువాలి తిరునగరి నుండి పల్లకిలో వేంచేసి, తిరుక్కురైయలూర్ క్షేత్రమును చేరి అచట వేంచేసియున్న పంచ నృసింహమూర్తులకు "వాడినేన్‌వాడి", పాశురాలతో మంగళా శాసనం చేయుదురు. పిమ్మట మంగై మఠం చేరి "అజ్గణ్ జ్ఞాలం" అను పాశురములతో ఉత్తరదేశమున వేంచేసియున్న "శిజ్గవేళ్‌కున్ఱమ్"(అహోబిలం) పెరుమాళ్లకు మంగళ శాసనం చేయుదురు.

అటు పిమ్మట తిరుక్కావళంబాడి, తిరుమణిక్కూడం; తిరుపార్తం పళ్లి మొదలగు క్షేత్రములకు వేంచేసి పెరుమాళ్లకు మంగళా శాసనము చేసి తిరుక్కావేరి

                                              41 నది యొడ్డునగల మంజక్కుళి మంటపము నందు వేంచేయగా అచట తిరుమంజనము వైభవముగా జరుగును.

అనంతరము "తుళంగునీణ్ముడి" యను పాశురముతో "నంబెరుమాళ్లకు"(శ్రీరంగనాధులకు) "కులైయార్‌న్ద" అను పాశరముచే "తిరునఱైయూర్" నంబిగారికి మంగళాశాసనము చేసి సాయంకాలమునకు తిరునాంగూర్ వేంచేయుదురు. ఇచ్చట వేంచేసియున్న ఆరు తిరుపతులలోని పెరుమాళ్లకు మంగళాశాసనం చేసి అచటనే వేంచేసి యుందురు.

మరునాడు తిరువాంగూర్ ఆదిగాగల 11 క్షేత్రముల పెరుమాళ్లు మణిమాడక్కోయిల్‌కు వేంచేసి ఆళ్వార్లచే మంగళా శాసనములను పొందుదురు. పెరుమాళ్లు అందరకు తిరుమంజనములు జరిగిన పిమ్మట నాటిరాత్రి పెరుమాళ్లు అందరు గరుడ వాహనముల మీదను ఆళ్వార్లు హంస వాహనము మీదను వేంచేయగా తిరువీధి ఉత్సవము జరుగును.

మరునాడు పెరుమాళ్లు తమ తమ సన్నిధులకు వేంచేయగా ఆళ్వార్లు "తిరిత్తేవనార్‌తుగై" మొదలగు దివ్య దేశములకు మంగళా శాసనం చేసి తిరువాలిని చేరగా అచట వేంచేసియున్న నృసింహస్వామి గరుడవాహనమున సేవ సాదింతురు. వారికి మంగళా శాసనం చేసి తిరుమంగై ఆళ్వార్లు తిరునగరికి వేంచేతురు. ఈ పండ్రెండు గరుడ సేవలు తప్పక సేవింప దగినవి.

మార్గము: శీర్గాళి నుండి 10 కి.మీ.

పా. నన్దావిళక్కే యళత్తఱ్కరియామ్‌ నరనారణనే కరుమాముగిల్ పోల్
    ఎన్దాయ్;ఎమక్కేయరుళా యెననిన్ఱిమై యోర్‌పరమిడమ్‌ ఎత్తిశైయుమ్;
    కన్దార మన్దేనిశై పాడ మాడే కళివణ్డుழிత్త ழிల్ తుదైన్దు;
    మన్దారనిన్ఱు మణమల్గునాజ్గూర్ మణిమాడక్కోయిల్ వణజ్గెన్ మననే

పా. విడై యోడ వెన్ఱాయ్‌చ్చి మెన్ఱోళ్ నయన్ద వికిర్దావిళజ్గు శుడరాழி యెన్ఱుమ్‌
    పడై యోడు శజ్గోన్ఱుడై యాయా యెననిన్ఱమై యోర్ పరవుమిడమ్‌ పైన్దడత్తు
    ప్పెడై యోడు శెజ్గాలవన్నమ్‌ తుగైప్పత్తొగైప్పుణ్డరీకత్తిడెచ్చెజ్గழுనీర్
    మడై యోడ నిన్ఱు మదువిమ్మునాజ్గూర్ మణిమాడక్కోయిల్ వణజ్గెన్ మననే
             తిరుమంగై ఆళ్వార్-పెరియతిరుమొழி 3-8-1,9

                                           42