దివ్యదేశ వైభవ ప్రకాశికా/తిరువెஃకా

వికీసోర్స్ నుండి
ముఖచిత్రం

82. తిరువెஃకా (కాంచీ) 9

శ్లో. శ్రీవెஃకా నగరే భుజంగశయన శ్రీసాయిగై పద్మాకరో
   ద్దీపే తత్ర యథోక్తకారి భగవాన్ శ్రీవేదసారాహ్వయే
   వైమానే వరకోమలాఖ్యలతికా నాథస్తు పశ్చాన్ముఖ:
   ప్రత్యక్ష: కణికృష్ణ ధాతృసరసాం భాతి శ్రితేష్టార్థద:||

   సరోజాత మహాయోగి భక్తిసార మహర్షిభి:|
   కీర్తిత: కలిజిన్నామ మునినాచాపి సాదరమ్‌||

వివ: యథోక్తకారి(శొన్నవణ్ణం శెయ్‌ద పెరుమాళ్)-కోమలవల్లి-భుజంగ శయనం-పొయిగై పుష్కరిణి-వేదసార విమానము-పశ్చిమ ముఖము-కణికృష్ణునకు బ్రహ్మకు ప్రత్యక్షము-పొయిగై ఆళ్వార్, పేయాళ్వార్, తిరుమళిశై ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: ఇది పొయిగై ఆళ్వార్ అవతరించిన స్థలము-వారు ఈ దివ్యదేశమున గల పుష్కరిణిలో అవతరించిరి. ఈ రాజ్య పాలకుడు తిరుమళిశై ఆళ్వార్ శిష్యులగు కణికృష్ణుడు అనువారిపై కోపించి రాజ్యము నుండి వెడలగొట్టెను. అంత శిష్యునితో తిరుమళిశై ఆళ్వారు ఊరువిడిచి పోవుచు "కణికణ్ణన్ పోగిన్ఱాన్ కామరపూమ్‌కచ్చి, మణిపణ్ణా నీకిడక్క వేణ్డా" అని అనగానే స్వామికూడా వారితోబాటు బయలుదేరెనట. రాజు భయపడి కణికృష్ణుని ప్రార్థించి వారిని మరల రాజ్యమున ఉండుమని కోరగా ఆళ్వార్లు తిరిగి "కణికణ్ణన్ పోక్కొళిన్దాన్ కామరపూమ్‌కచ్చి మణివణ్ణా నీ కిడక్క వేణ్డుమ్" అని అనగానే స్వామి తిరిగి యథా ప్రకారము వేంచేసిరట. ఈ విధముగా తమభక్తులు చెప్పినది చెప్పినట్లే చేయు స్వామి అగుటచే వీరికి యథోక్త కారియని తిరునామము వచ్చినది. ఇచట స్వామి ఎడమ చేతిమీద శయనించి యుందురు. ఇచట పిళ్లై లోకాచార్యుల వారికి ప్రత్యేకముగా సన్నిధి కలదు. ఈ సన్నిధిలోనే మణవాళ మహామునులు శ్రీభాష్యమును సేవించిరి. ఈ క్షేత్రస్వామి విషయమై శ్రీమద్వేదాంత దేశికులు వేగాసేతు స్తోత్రమును అనుగ్రహించిరి.

పంగుని(మీనం) రేవతి తీర్థోత్సవంగా బ్రహ్మోత్సవము జరుగును. కంచి వరదరాజస్వామి సన్నిధికి 1 కి.మీ దూరములో ఈ సన్నిధి గలదు.

పా. కూన్దలార్ మగిழ்;కోపలనాయ్;వెణ్ణెయ్
    మాన్దழన్‌దైయిల్; క్కణ్డు మకిழ்న్దు పోయ్
    ప్పాన్దళ్ పొழிయిల్; పళ్లి విరుమ్బియ
    వేన్దనై చ్చెన్ఱు కాణ్డుమ్‌; వెஃకావిలే.
          తిరుమంగై ఆళ్వార్లు-పెరియ తిరుమొழி 10-1-7.

101

83. తిరుక్కారగమ్‌ (కాంచీ) 10

శ్లో. అక్కిరాయ సరోరమ్యే కారకాఖ్యాన పట్టణే|
   మద్మామణి రమానాథ:కమలాకర నాయక:||
   వామనం ప్రాప్య వైమానం దక్షిణాముఖ సంస్థిత:|
   కారకర్షి తపోలబ్ధ రాజతే కలిజిన్నుత:||

వివ: కరుణాకర పెరుమాళ్-పద్మామణి త్తాయార్-అక్రాయ పుష్కరిణి-వామన విమానము-దక్షిణ ముఖము-నిలచున్నసేవ- కారక మహర్షికి ప్రత్యక్షము-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: ఈ సన్నిధి ప్రత్యేకముగా లేదు. ఉలగళన్ద పెరుమాళ్ సన్నిధిలో తాయార్ సన్నిధికి ఎదురుగా నున్నది.

పా. నీరగత్తాయ్ నెడువరైయి నుచ్చి మేలాయ్
          నిలాత్తిజ్గళ్ తుణ్డత్తాయ్ నిఱైన్దకచ్చి
   ఊరగత్తాయ్, ఓణ్ తుఱైనీర్ వెஃకావుళ్ళాయ్
          ఉళ్ళువారుళ్ళత్తాయ్; ఉలగ మేత్తుం
   కారగత్తాయ్ కార్‌వానత్తుళ్ళాయ్ కళ్వా
          కామరుపూజ్కావిరియిన్ తెన్బాల్ మన్ను
   పేరగత్తాయ్, పేరాదెన్నె-- నుళ్ళాయ్
          పెరుమామన్ తిరువడియే పేణినేనే.
          తిరుమంగై ఆళ్వార్లు-తిరునెడున్దాణ్డగమ్‌ 8


మంచిమాట

"మీకు వలదా!"

ఒకప్పుడు నంజీయర్ అను ఆచార్యులు అనారోగ్యముచే బాధపడుచుండిరి. వారికి ప్రాణాపాయము తప్పదని అందరు భావించుచుండిరి. ఆసమయమున "కుట్టక్కుడి యిళైయాళ్వార్" అనువారు వారి యొద్దకు వెళ్ళి ఈ సమయమున ఆత్మకు హితమైన ద్వయమంత్రమును అనుసంధానము చేయరాదా! అని పలికిరట. దానిని విని నంజీయర్ "మీరు అనుసంధానము చేసికొనరాధా! నాకేమికావలెను. ఇంకను ఈ లోకములో తిరిగే మీకు అవసరములేనిది మంచములో పడియున్న నాకు మాత్రమేనా కావలెను!" అని సమాధానమిచ్చిరట. కావున ఇహలోకయాత్ర చేయువారికిని పరమపదయాత్ర చేయువారికిని హితమైనది ద్వయమంత్రము మాత్రమే.

                                             102