దివ్యదేశ వైభవ ప్రకాశికా/తిరువల్లవాళ్

వికీసోర్స్ నుండి

66. తిరువల్లవాళ్- 8 (తిరువల్లాయ్)

(శ్రీవల్లభక్షేత్రం)

శ్లోకము : ఘంటాకర్ణ సరోవరేణ కలితే శ్రీ వల్లవాళ్ పత్తనే
        భాతి ప్రాజ్ముఖ మండిత స్థితి యుతః కోలప్పిరాన్ నామకః
        వైమానం చతురంగ మాప్య గృహిణీం శెల్వక్కొళుందాహ్వయాం
        ఘంటాకర్ణ నిరీక్షితః కలిజిత స్తుత్య శ్శఠారే ర్మునేః

వివ: కోలప్పిరాన్ - శెల్వత్తిరుక్కొళుందు తాయార్ - ఘంటాకర్ణ సరస్సు - తూర్పుముఖము - నిలుచున్నసేవ - చతురంగకోల విమానము - ఘంటాకర్ణునకు ప్రత్యక్షము - నమ్మాళ్వార్లు, తిరుమంగై ఆళ్వార్లు కీర్తించినది.

విశే: ఈ క్షేత్రమునకు ' తెన్ నగర్ ' సుందరమైన దివ్యదేశము (తి.వా.మొ. 5-9-11) అను విలక్షణమైన తిరునామము కలదు. ఈ క్షేత్రము ద్వాపర యుగమున శ్రీకృష్ణునిచే ప్రతిష్ఠింపబడినదని చెప్పుదురు. చతురంగ విమానమునకు వెనుక చక్రత్తాళ్వార్ వేంచేసియున్నారు. ఈ సన్నిధి లోపలకు స్త్రీలను రానీయరు. వెలుపలనుండియే సేవింపవలెను. కానీ ధనుర్మాసములో ఆర్ద్ర నక్షత్రమునాడు, మేష సంక్రాంతినాడు మాత్రము లోపలకు రానిత్తురు.

సర్వేశ్వరుని పొందుటకు ఉపాయము సర్వేశ్వరుడే. ఆతడే ఉపాయమని మనకు తెలియజేయునది ఆస్వామి కృపాగుణమే. ఆకృపాగుణమునే నమ్మాళ్వార్లు తిరువాయిమొழி (5-6-9)లో పెరుమానదు తొల్లరుళే (సర్వేశ్వరుని స్వాభావికమైన కృప) యని కృపాగుణమును ప్రకాశింపజేసిరి. ఈ క్షేత్రమునకు శ్రీవల్లభక్షేత్రమనియు తిరునామము కలదు.

మార్గము: కొల్లం - ఎర్నాకుళం రైలు మార్గంలో తిరువల్లాయ్ స్టేషన్ నుండి 5 కి.మీ. బస్సు వసతి కలదు. ఇచట సత్రములో దిగి బస ఏర్పాటు చేసికొని తిరుచ్చెంకున్ఱూరు వాని సమీప క్షేత్రములు సేవింపవచ్చును. తిరుచ్చెంకున్ఱూర్ కు ఉత్తరమున 10 కి.మీ. దూరములో ఈ క్షేత్రము కలదు. తిరువణ్డ్‌ణూరుకు 8 కి.మీ.

పాశురము: మానేయ్‌నోక్కు నల్లీర్; వైగులుమ్‌ వినై యేన్మిలియ,
         వానార్ వణ్‌కముకు; మ్మత్తు మల్లిగై కమழுమ్‌
         తేనార్ శోలైగళ్ శూழ்; తిరువల్లవాழுఱైయుమ్‌
         కోనారై; యడియే; నడికూడువ తెన్ఱుకొలో -
               నమ్మాళ్వారు - తిరువాయిమొழி 5-9-1.

83

67. తిరువణ్ వండూరు 9

శ్లో. వణ్ వండూర్ పురి పాపనాశ సరసా యుక్తేతు వేదాలయం
   వైమానం సమధిశ్రితో వరుణ దిగ్వక్త్ర స్థితి: ప్రీతిమాన్|
   దేవ: పాంబణయప్ప నంబుజలతా నాథ స్సముజ్జృంభతే
   మార్కండేయ సునారాదాక్షివిషయ: కీర్త్య:శఠద్వేషిణ:||

వివ: పాంబణయప్పన్-కమలవల్లి త్తాయార్-నిలచున్న సేవ-పాపనాశపుష్కరిణి-వేదాలయ విమానము-పశ్చిమ ముఖము-మార్కండేయునకు, నారదునకు ప్రత్యక్షము-నమ్మాళ్వార్ కీర్తించినది.

విశే: ఈ క్షేత్రము నకులునిచే ప్రతిష్ఠ చేయబడినదని చెప్పుదురు. ఆళ్వార్లు అనేకవిధముల సర్వేశ్వరుని ప్రార్థించియు అభీష్టము లభింపక "దానికేమి కారణమని" ఆలోచించి "శ్రియ:పతి తిరువణ్ వణ్డూరులో వేంచేసియుండి అచటి భోగ్యతా విశేషములకు పరవశుడై తనను మరచి యుండు" నని భావించి స్వామియొక్క ఆర్తరక్షణ దీక్షను గుర్తుచేయదలచి సముద్రతీరమున సంచరించు పక్షులను శ్రియ:పతి యొద్దకు దూతలుగా పంపుచున్నారు.

ఇది ఆళ్వార్లు సర్వేశ్వరుని విషయమై నాయికా భావముతో దూతప్రేషణము చేసిన దివ్య దేశము. తిరువాయిమొழிలో గల నాల్గు దూతప్రేషణములలోనిది రెండవది. మొదటిది "అ--ఱైయ మడనారాయ్" అను దశకమున వ్యూహమూర్తి విషయమై దూతప్రేషణ గావింపబడినది. ఈ క్షేత్రస్వామి విషయమైన "వైకల్ పూజ్గழிవాయ్" అను దశకమున(6-) "ఏఱు శేనగనాఱ్కు"(వర్దిల్లుచున్నశైర్యము గలవానికి) యని విభవమూర్తి విషయమై దూత ప్రేషణము నెరుపబడినది. ఈక్షేత్రమునకు పంపోత్తర దేశమను తిరునామము గలదు. పంపానదికి ఉత్తరతీరమందున్న దివ్యదేశము అని అర్థము. (తి.వా.మొ. 6-1-10).

మార్గము: శెజ్గణూర్‌కు వాయువ్యముగా 5 కి.మీ. వసతులు స్వల్పము. తిరువల్లవాళ్ నుండియు సేవింపవచ్చును.

పా. వైకల్ పూజ్గழிవాయ్; వన్దుమేయు జ్గురుకినజ్గాళ్;
   శెయ్‌గొళ్ శెన్నలుయర్; తిరువణ్వణ్డూరుఱైయుమ్;
   కైగొళ్ శక్కరత్తైన్;కనివాయ్ పెరుమానై క్కణ్డు;
   కైగళ్ కూప్పి చ్చొల్లీర్; వినై యాట్టియేన్ కాదన్మైయే
            నమ్మాళ్వార్-తిరువాయిమొழி 6-1-1

84