దివ్యదేశ వైభవ ప్రకాశికా/తిరుచ్చెంకున్ఱూర్

వికీసోర్స్ నుండి

పా. కరుమాణిక్కమలై మేల్; మణిత్తడన్తామరై క్కాడుగళ్‌పోల్
    తిరుమార్వు వాయ్ కణ్‌కై; యున్ది కాలుడై యాడై కళ్ శెయ్య పిరాన్;
    తిరుమాలెమ్మాన్ శెழுనీర్వయల్; కుట్టనాట్టు త్తిరుప్పులియూర్;
    అరుమాయన్ పేరన్ఱిప్పేచ్చిల; ళన్నై మీరిదఱ్కెన్ శెయ్‌గేనో.
              నమ్మాళ్వారు-తిరువాయిమొழி 8-9-1

64. తిరుచ్చెంకున్ఱూర్ 6 (శంగఱూర్)

శ్లో. చెంకున్ఱూర్ నగరే తు శంఖ సరసీ హ్రస్వాపగా సంయుతే|
   వైమాసం సమధిశ్రిత స్థితిలసన్ దివ్యం జగద్యోతిషమ్|
   నాయక్యా నిమిష: ప్రభుర్విజియతే పశ్చాన్ముఖాంభోరుహే
   యుక్త శ్శంగమలాభిధా సహితయా శ్రీ మచ్చఠారి స్తుత:||

   భస్మాసుర నిమిత్తేన శశిభూషణ వీక్షిత:
   భక్తబృంద పరిత్రాణ కాముక స్సతతం హరి:||

వివ: ఇమయవరప్పన్-శెంగమలవల్లి-శంఖ పుష్కరిణి-హ్రస్వాపగా నది(దీనికే తిరుచ్చిత్తార్ అని పేరు) జగజ్ఱ్యోతి విమానం-పశ్చిమ ముఖము-నిలుచున్న సేవ-భస్మాసుర నిమిత్తమై పరమశివునకు ప్రత్యక్షము-నమ్మాళ్వార్ కీర్తించినది.

విశే: సంసారులు స్వప్రయోజనపరులు. స్వామి యందు సుంతయేని ప్రేమలేనివారు. అట్టి సంసారుల మధ్యలో స్వామి అవతరించినాడే! ఈస్వామి కేమగునో యని ఆళ్వార్లు భయపడినారు. ఆళ్వార్ల భయమును గమనించిన స్వామి తన శౌర్యవీర్యాదులను ప్రదర్శించి మీకేమియు భయము వలదు. నిర్బరులై యుండుడనిరి. ఆశౌర్య గుణమును "కజ్జనైత్తగర్‌త్త శీర్‌కొళ్" (కంసుని చంపిన శౌర్యగుణము గలస్వామి) యని కొండాడిరి.(8-1-1)

మార్గము: తిరువనంతపురమున స్వామిని సేవించి అటనుండి బయలుదేరి "వర్కలా" స్టేషనులో దిగి "జనార్థన" క్షేత్రమును సేవించి అచట నుండి కొట్టార్కరై స్టేషనులో దిగవలెను. ఈ కొట్టార్కరైకు 50 కి.మీ. దూరములో బస్సుమార్గమున ఈ శెంగణూర్ కలదు. "త్రివేండ్రం" "ఎర్నాకులం" (వయా) కొల్లం రైల్వేలైనులో శెజ్గనూర్ స్టేషన్. అన్ని వసతులు కలవు. ఈ శెంగణూర్ నుండి అయిదు దివ్యదేశములను సేవింపవచ్చును.

శెంగణూర్ నకు తూర్పున 10 కి.మీ.దూరమున-తిరువారన్ విళై. నైఋతి 5 కి.మీ. దూరమున తిరుప్పులియూర్, వాయవ్యం 5 కి.మీ. దూరమున తిరువణ్ వణ్డూరు.

81 ఉత్తరం 10 కి.మీ. దూరమునతిరువల్లాయ్, 25 కి.మీ. దూరమున తిరుక్కుడిత్తానం క్షేత్రములు గలవు.

పా. వార్‌కడావరుని యానై మామలైయిన్; మరుప్పిణైక్కువడిఱుత్తురుట్టి
    ఊర్‌కొళ్ తిణ్బాగ నుయిర్ శెగుత్త రజ్గి మల్లరై క్కొన్ఱు శూழ் వరణ్‌మేల్
    పోర్ కడావరశర్ పుఱక్కిడ; మాడమీమిశైక్క--నై త్తగర్‌త్త,
    శీర్‌కొళ్ శిత్తాయన్ తిరుచ్చెజ్గన్ఱూరిల్; తిరుచ్చిత్తాఱెజ్గళ్ శెల్ శార్వే.
                నమ్మాళ్వార్-తిరువాయిమొழி 8-4-1

65. తిరునావాయ్ 7

శ్లో. శ్రీమచ్చెంగమలాభిధాన సరసా యుక్తే పురే సుందరే
   నావాయ్ నామని వేద మందిర వరే యా మ్యాఅసనాలంకృత:
   లక్ష్మీ నాగవరేక్షిత స్సముపయన్ దేవీం మలర్ మంగ ఇ
   త్యాస్తే స్తుత్య వపు శ్శఠారి కలిజిత్ యుగ్మేణ నారాయణ:||

వివ: నారాయణన్(నావాయ్ ముకుందన్)-మలర్ మంగై తాయార్-శెంగమల పుష్కరిణి-వేద విమానం-దక్షిణ ముఖము-కూర్చున్నసేవ-లక్ష్మీదేవికి గజేంద్రునకు ప్రత్యక్షము-నమ్మాళ్వార్ తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: మలైనాడు సన్నిధులలో తాయార్లకు వేరుగా సన్నిధి ఇచట మాత్రమే కలదు. నమ్మాళ్వార్లు ఈ పెరుమాళ్ల విషయమై "ఆసృశంస్యము" అనే గుణమును ప్రకాశింపజేసిరి.

సర్వేశ్వరుని వియోగముచే కలిగిన దు:ఖ సముద్రమును దాటించు నావవంటివాడు ఈస్వామి "ఆవానడి యానివనెన్నరుళాయే" వీడు నా దాసుడని నన్ను దయజూడుమా! అని ఆసృశంస్య గుణమును (9-8-7) ప్రకాశింపజేసిరి. ఇచట "నవాయుఱైకిన్ఱ" "నావగా వసించుచున్నట్టివాడు" అని పేర్కొనుటచే ఈ దేశమునకును తిరునావాయ్ అను తిరునామము కలిగినది.

మార్గము: షోరానూర్ నుండి కళ్లికోట పోవు మార్గములో గల "ఎడకోలమ్" నకు 1 కి.మీ. దూరమున గలదు. షోరానూర్ నుండి బస్‌లో కుట్టీపురంచేరి అక్కడ నుండి వేరుబస్సులోను చేరవచ్చును. వసతులు స్వల్పము.

పా. కోవాగియ;మావలియై నిలజ్కొణ్డాయ్
    తేవాశురమ్; శెత్తవనే తిరుమాలే!
    నావా యుఱైగిన్ఱ ఎన్నారణ నమ్బీ;
    ఆవా వడియా నివ నెన్ఱరుళాయే.
        నమ్మాళ్వార్-తిరువాయిమొழி 9-8-7.

82