గ్రామ కైఫియ్యత్తులు: గుంటూరు తాలూకా (రెండవ భాగము)/గొరిజవోలు

వికీసోర్స్ నుండి

83

గొరిజవోలు

కయిఫియ్యతు మౌజే గోరిజవోలు సముతు నాదేండ్ల

తాలూకే సత్తెనపల్లి సర్కారు మృతు౯జాంన్నగరు రాజా

మానూరి వెంక్కట రమణయ్యరావు మజుందారు జమీందారు

స్న౦౨౨౨ ఫసలీ (1812 A.D).

ఈ గ్రామాన్కు. పూర్వంనుంచి గొరిజవోలు అనే వాడికెవుంన్నది. గజపతి శింహ్వాసనస్తు డయ్ని గణపతి మహారాజులుంగారు శాలీవాహనం ౧౦౫౬ శకం (1134 A.D) లగాయతు ప్రభుత్వం చేశేటప్పుడు వీరిదగ్గిర మహాప్రధానులయ్ని గోపరాజురామంన్న గారు శా ౧౦౬౩ శక (1145 A.D) మంద్దు ప్రభువుదగ్గర దానంపట్టి సమస్తమయిన నియ్యోగులకు గ్రామ కరిణీకపు మిరాశీలు నిన౯యించ్చేయడల యీగ్రామాస్కు శుక్లయజుశాఖాధ్యయనులుంన్నూ భారద్వాజస గోత్రులు సంప్రతులు ౨కి సావడివారి సంప్రతి గుల౯వారి సంప్రతి ౧ యీ రెండు సంప్రతులవారికరిణీకం నిన౯యించినారు గన్కు తదాది మొదలుకొని యేతద్వంశజు లయినవారు అనుభవిస్తూ వుంన్నారు.

వడ్డే రెడ్డి రాజులు ప్రభుత్వములు శాలీవాహానం ౧౦౪౬ శకం (1124 AD) వరకు జరిగిన తరువాతను శా౧౪౩౭ శకం (1515 A.D) లగాయతు నరపతి శింహ్వాసనస్తుడయిన శ్రీకృష్ణ దేవమహారాయులు అచ్యుతరాయులు ప్రభుత్వములు చేశిన తర్వాతను సదాశివ దేవరాయులు ప్రభుత్వం చేసేటప్పుడు యీ గ్రామం తాళ్లపాక తిరువెంగళనాధయ్యంగారికి శాలివాహనం ౧౪౭౮ (1558 A.D) అగునేటి విభవ సంవత్సర శ్రావణ బ ౧౨ గురువారంనాడు అగ్రహారంచేశి ధారాగ్రహితంచేశినారు. తదనంతరం రామరాయలు, తిరుమలరాయులు అధికారం జరిగిన పింమ్మట శ్రీరంగ్గ దేవమహారాయులు ప్రభుత్వం చేస్తూ యీగ్రామానకు శ్రీరంగపురమనే అభిధానంచేశినారు (మార్క) కొండపుత్రు లయిన జాతకంన౯ విరుపాక్షుణిరె అగ్రహారం యిచ్చినారు.

యిందుకు శాసనములు (గలవు)

స్వస్తిశ్రీ విజయాభ్యుదయ శాలీవాహనశక పరుషంబులు ౧౪౪౯ అగునేటి యీశ్వర సంవ్వత్సర కార్తీక శుద్ధ శ్రీమద్రాజాధిరాజపరమేశ్వర శ్రీ వీర ప్రతాప శ్రీ వీర శ్రీ రంగ్గనాటిదేవ మహారాయలు అయ్యవారు రత్న శింహ్వాసనారూఢులయ్యి పృధివీసామ్రాజ్యము చేయుచున్న మార్క కొండ్డ పుత్రుడయిన జాతకంన౯ విరూపాక్షున్కి యిచ్చిన ధర్మశాసనం....

కొండవీటి రాజ్యములోని గొరిజవోలు గ్రామం ప్రతినామధేయమయిన శ్రీరంగరాయ పురయు సర్వమాన్యపు అగ్రహారముగాను పాలించి యిస్తామని ధర్మం యిస్తిమిగన్కు యీ గ్రామాన్కు ఆష్టదిక్కులుంన్ను శిలా స్తంభాలు తూపు౯న సంకురాత్రిపాడు ఆగ్నేయానకు సొలసదక్షిణం నైరుతిభాగానకు జంగాలపల్లె పడమటను నందవరం———పొణుకుబాడు గ్రామ కై ఫియత్తులు వుత్తరానకు మెర్కపూడి, యిశాన్యానకు నుదురుబాడు యివి అష్టదిక్కులు యీక్రమంగా అగ్ర హారంచేశి యిచ్చినారు గన్కు సదరహి శ్రీరంగరాయులవారి ప్రభుత్వం శాలివాహనం ౧౫౦౦ శకం (1579 A.D) వరకు జరిగినది గన్కు ఆగ్రహారమున్ను జరిగినది. శాలివాహనం ౫౦౨ శక (1580 A.D) మందు మల్కి విభురాంపాడుశాహాగారు శ్రీరంగరాయుల వారిని జయించి కొండవీటిదుర్గం పుచ్చుకొనేగన్కు అతని తాలూకు అధికారములు దేవస్థానములు పాడుచేశి అగ్రహారములు తీశివేశి నారుగనుక ఈ అగ్రహారమున్ను ఖిలపడ్డది. హాకములు కొండవీటిశీమ్ సముతు బందీలు కేశేటప్పుడు యీ గ్రామం నాదేండ్ల సమతులో దాఖలు చేశి సముతు అమీలు చేదరు దేశపాండ్యాల పరంగా బహుదినములు అమానిమామిలియ్యతు జరిగించినారు. కొండవీటిశీము జమీదాలకాకు వంట్లు చేసి పంచిపెట్టేయడల యీగ్రామం సరకారు మజుందాలుజౌ అయిన మానూరి వెంక్కన్న పంతులుగారివంత్తువచ్చిచ్కిలూరి పాటి తాలూకాలో దాఖలు అయినది గన్కు వెంకన్న పంత్తులు అప్పాజీ పంత్తులు వెంక్కటరాయునింగారు వెంక్కట కృష్ణునింగారు ప్రభుత్వముచేశిన తర్వాతను వీరి కొమారులయిన నరసన్నగారు ప్రభు త్వం చేస్తూవుండగా పయిని వాశిన అప్పాజీ పంత్తులుగారి కొమారులయిన వెంకటేశ్వరావు గారు తాలూకా సఖంపంచుకొనే యడల యీగ్రామం వెంకటేశంగారి వంతు వచ్చిన సత్తెనపల్లె తాల్లూకాలో దాఖలు అయినది. 84 స్న ౧౨౦౫ ఫసలీ (1795 A.D) వర్కు వెంక్క దేశంరావుగారు ప్రభుత్వంచేశిన మీదట వీరికొమారులయిన వెంక్కటరమణయ్య రావుగారు ప్రభుత్వం చేస్తూ వుంన్నారు. రిమాకు గ్రామం గుడికట్టుకుచ్చెళ్లు ౭౫ కి మినహాలు ou గ్రామ కంఠాలు 32. మాలపల్లె వాగులు ๆ ๆ Tollo Bol Toll 040 olo C కి డొంకలు 9 కి పాతూరి మూతికా వేయించిన పంట చెరువు ౧ కి కేసరిశేటు గురప్ప వేయించిన ధర్మముకుంట యితనే వేయించిన తోట ౧ కి మోతాడు శెబ్బు దావావేయించిన ధర్మకుంట... చాకలి వీరుడు వేయించిన ధర్మకుంట... మాలముత్తడు వేయించిన ధర్మ చెరువు కి చవుడు దం తెల భూమి ౧౬. గ్కా తతిమ్మా ౫౮౧౭ కుయినాములు. గోలకొండ తురకలకు కరణాలు గోమఠం రాఘవాచాలు గార్కి నందిపాటి వెంక్కటాచార్యుల వారికి

౧ మాములూరీ నరశింహాశాస్త్రులు గారికి
౦౺౦ యలవర్తి రామకృష్ణుమ్మ గారికి-
౦౺౦ చాతునూరి వెంక్కటాచలం
౧ మాడబూచి పాపాచార్యులు —
౦౹౦ శంకరముఖ ప్రసన్న...
౧ (మసీదు) మాన్యం
౧ చట్టి పురుషో త్తమాచార్యులు
౧ ఘాలిరామ బ్రహ్మ శాస్తులు
౦౺౦ చతువే౯దాల నరసింహ శాస్తులు౯
౹౦ పత్రి వెంక్కట నారాయణప్ప గారికి
—————
౧౫౻౦ గ్కా నిలువ ౧౨౺౽ కు

శెరీ ౩౪౺౦ సావరం రాజామానూరి వెంక్కట రమణయ్యరావుగార్కి శ్రీముఖనామ సంవ్వత్సర చైత్ర బ౯ స్తిరవారం ది ౨౩ యెప్రియలు ఆ ౧౮౧౩ (1813 A. D) సంవత్సరం———