క్షాత్రకాలపు హింద్వార్యులు/క్షాత్రయుగమునాటి హింద్వార్యులు - వారి వివాహములు

వికీసోర్స్ నుండి

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు - వారి వివాహములు

                      ------
   క్షాత్రాయుగారంభము నాటినుండి తద్యుగాంతమునాటి వరకు హింద్వార్యులు యాహారమునందు వాటిల్లిన మార్పులను వెనుకటి వ్యాసమున జూసి యుంటిమి. సాంఘికకాచారములలో వివాహము చాలాప్రధానమైనది కనుక అప్పటివారి వివాహము లెట్లుండునో ఈ వ్యాసమున నాలోచింతము.
   హిందూదేశమునకు రాకపూర్వమే ఆర్యులు వివాహ విధిని పవిత్రకార్యముగా భావించుచుండిరని తెలియుచున్నది. అయినను వారిలో నొకకాలమున వివాహపద్దరి యుండనేలేదను సంగతి మహాభారమునందు కావవచ్చుచున్నది. పూర్వకాలమున స్త్రీలు ఒక పురుషుని వివాహముమాడనిర్భంధముందలేదనియు, వారి కీవిషయమున సంపూర్ణమగు స్వేచ్చయుండేననియు--ఏకంబీజో ద్భవ్లమను నభిమానము అభావమగుటవలన భ్రాతృభావము జనులయందు లేకపోవుటచేతను, ముదుసలులగు స్త్రీపురుషులనే మమారయువారు లేకపోవుటచేతను, తదితరకారణములవలనను, వివాహపద్దతి యవసరమయ్యెననియు-కనుకనే ఒకపతిని ++ పొం

++వ్యుచ్చరంత్యాతో పతింనార్యా, అన్యప్రభృతిపాతకం। భ్రూణహత్యా

క్షాత్రాయుగమునాటి హింద్వార్యులు.

దనిస్త్రీ భ్రూణహత్యా దోషము ననుభవించుననియు ఋషులు, విధించిరనియు, పాండురాజు కుంతిని నియేగపద్ధరిని సంతానము బడయ నాజ్ఞాపించు సందర్భమున నున్నది. పైవాక్యమున నుల్లేఖింపబడిన "పూర్వకాలము" క్షాత్రయుగముమునకంటే యెంతోపురాతనమై యుండవలయును. వీరకవ్యములకు సమకాలీనములగు నుపనిషత్తులలోగూడ నొకసందర్భమునకలదు. ఆసందర్భమున ఒకడు తనతల్లిని "నాతండ్రియెవరు!" అనియడుగ గా "నేనుయౌవనకాలమున పలువురితో సాంగత్యము చేసితిని కనుక నీతండ్రి ఫలానివాడని చెప్పజాలను" అని తల్లి ప్రత్యుత్తర మిచ్ఫెను. ఈకధయు, వివాహవిధి ఇంకను ఉనికి లోనికి రాక యున్న అతిపురాతనకాలపు విషయమై యుండవచ్చును. కుమారుని పేరు తల్లిపేరుతోగలిసిచెప్పు నాచారముకూడ అట్టికాలపు దేయైయుండవచ్చునని మాతలంపు.

      క్షాత్రాయుగారంభమున బహుభార్యాత్త్వము సామాన్యాచారమై యుండుట మనకు విస్పష్టముగా నగపడుచున్నది. దశరధునకు మూడువందల ఏబదిమందిభార్యలును, (దేవేరులు మాత్రము మువ్వురే), రావణుడు వేయిమంది భార్యలును ఉండిరి. ఇక ఈవిషయమున అందఱనుమించినవాడు మన శ్రీకృష్ణుడు. అతనికి పదునాఱువేల భార్యలుండిరని చెప్పుదురు. ఈసం ------------------------------------------------------
సమంఘోరం, భవిష్యత్యనుభావహం ॥అని॥ భార్యవిషయమున నక్రమముచేసిన పురుషునకు గూడ నిట్లె దోషము విధింపబడియున్నది కాని వానిని మనవారు పాటింపరు. భార్యాంసధావ్యుచ్చరిత, కౌమారబ్రహ్మచారినీం । పత్నివతామేతదేం, భవితాపాతకంభువికిఅని

వారి వివాహాములు.

ఖ్య కొంతయతియోక్తితో గూడినదేయైనను అతనిభార్యలసంఖ్య మాత్రము మితిమీరినదై యుండెదనుట నిశ్చయము. పరదేశీయు లలోపూరకాలమున "పార్క్యూల్సు" అనువాని కనేక మందిభార్య లుండినట్టును "సాలమను," అనునాతనికి వేయిమంది భార్యలుండి నట్లును తెలియుచున్నది. ఇవియన్నియు స్త్రీలు సాధారణములగు దోసిడివస్తువులుగా నెంచబడుచుందిన కాలపు ముచ్చటలు, ఆకాలమున ఒకదేశపురాజు వేఱొకదేసమును జయించునపుడు అచ్చట లభించిన దోపిడివస్తువులనెట్లో యట్లెయచ్చట దొరకిన స్త్రీలనుగూడ తెచ్చి తన మందిరములలో నునిచి తనవిషయాసక్తిని తృప్తిపఱచుకొనుటకు సాధనములుగా చేసికొనుచుండేను. ఆకాలమున మనదేశమునందు బ్రాహ్మణుడగు వాడును క్షత్రియుడును తమవర్ణములకు జెందిన స్రీలనేగాక, తమకు క్రింది వర్ణముల స్త్రీలనుగూడ పెండ్లి యాడవచ్చునను నియమముండెను. ఈనియమము భార్యలసంఖ్యను తగ్గించుటకు బదులుగా హెచ్చించు టకే తోడ్పడెను. దేశమునందలి విస్తీర్ణప్రాంతములు నిర్జనములుగా నుండి జనసంఖ్య తక్కువగానుండిన దినములలో భార్యలసంఖ్యను తగ్గించుట యనవసరముగా నైనను కాన్పింపలేదు. ఇకజనుల జీవితమందమా అదియును ఇప్పటికాల మంతకష్టముగా నుండలేదు. కనుక సంతానము కొఱకు వారెట్టి వివాహములనైను చేసికొనుచుండిరి.

 *బహుభార్యాత్త్వము ఆచారముగానుండిన క్షాత్రయుగాది యందే బహుభర్తృత్వముయొక్క  యుదాహరణముకూడ

  • దుర్యోధనునకు భీమునకు పలువురు భార్యలుండిరి. స్త్రీపర్వము.

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.

పాండవులయందు కానవచ్చుచున్నది. రెండవమరు మనదేశము నకు వచ్చి చల్లని ప్రదేశములలో నివసించిన యార్య్హులవెంట స్త్రీలు కొద్ది మందిమాత్రమే యుండుటవలన పరుపురుషులు ఒక స్త్రీనే భార్యగా గొనవలసివచ్చెను. మహాభారరమునందు బహుభర్తృత్వము నకు ద్రౌపదియొకతెయే యుదాహరనంగా గావవచ్చుచున్నది. అయినను పలువురొకవనితను పెండ్లియాడ వచ్చునా యను ప్రశ్న వచ్చినసందర్భమున యుధిష్టిరుడు "ఇది మా వంశాచారము" అని చెప్పియున్నాడు. ఈకారణమును బట్టి చూచినచో ఈయాచారము మొదటవచ్చిన యార్యులలో గాకపోయినను రెండవమారు వచ్చిన వారిలోక్షాత్రయుగారంభమ్న నుండెనని మన మొప్పుకొనవలసి యున్నది. ఇదికాకనియోగపద్ధతిని సంతానము బడయు నాచారము కూడ ఆకాలపు టార్యులలో నుండినట్టు కావచ్వచ్చుచున్నది. వీనినిబట్టి విచారించిన యెడలసంతానోత్పత్తి ఆదినములలో నత్యవసరము గానెంచబడుచుండెనని తోచుచున్నది.

బహుభార్యాత్త్వంఊ, బహుభర్తృత్వము, నియోగం వీనితొబాటు వితంతూద్వాహములును సభర్తృకల పునర్వివాహములును ఆచరణయందుండవచ్చునని మనకుదోచుట సహజము. దమయంతికి ద్వితీయస్వయంవరము జరుగునని ప్రకటింపబడి యుండెను. కానియిదిజరుగలేదు ఈసందర్భమున నలుడు సాధారణ స్త్రీవలె విషయలౌల్యమునకు లోబడిదానవని దమయంతిని నిందించెను. ద్యూతమున ద్రౌపదియోడబడిన పిమ్మట, పాండవులను వదలిదృతరాష్ట్రసుతులలో నోకని జేపట్టుమని దుర్యో

వారి వివాహములు.

ధనుడామెనాజ్ఞాపించును, ఇది పరిహాసముగా బలుక బడినవాక్యమే యైనుండవచ్చును. కాని ఉన్నతమగు నీతితత్వములనెరుగని స్త్రీలు ఒక భర్తనువదలి వేరొకభర్తనుపొందుట ఆకాలమున అసాధారణ విషయము కాదని దీనివలన దెలియుచున్నది. క్షాత్రయుగారంబమున వితంతూ ద్వాహముకాట ఎట్లుండినను, ఆయుగాంతమునమాత్ర మీయాచరము సంపూర్ణముగా నిషేధింప బడియుండెననుట నిస్సంశయము. $ ఆర్యస్త్రీలు పునర్వివాహము చేసికొనుటకు ప్రమాణములు రామాయణ భారతములందు లేవు. జర్మనులలో యొకతెగకు సంబంధించి వితంతువులు మరల వివాహము చేసికొనరని "టాసిటను" అనునతను వ్రాసియున్నాడు. దీనిని బట్టి చూచినచో ఆర్యజాతియందీనిషేధము అతిపురాతన కాలమునుండియే యుండేనని తోచుచున్నది. ఏలయన ప్రపంచములో మఱేజాతియందును ఇట్టి నిషేధముండినట్లు ప్రమాణము కానరాదు. "భక్తపూర్వ"లగు స్త్రీలను (అనగా క్షతయొనులను) వివాహము చేసికొనుటకు ఆర్యులు పాతకముగా నెంచుచుండిరి గనుక ఇట్టినిషేధము ఆర్యజాతియందు ఏర్పడేనని భావింప దగియున్నది. సైంధవుల్ని మఱునాటి సాయంత్రమువఱకు దెగ?టార్చెదనని అర్జునుడు చేసిన శపధమున ఇట్టివివాహము పాతకముగా దలపబడుచుండినట్లు తెలియుచున్నది. "భుక్తపూర్వ" లగ్ స్త్రీలను వివాహమాడిన


$ ఈవిషయమున దీర్ఘతముడు విధి నిర్ణయించెను.

ఏకవివపతిర్నార్యా యావజ్జీవపరాయణం।మృతేజీవివాతస్మి న్నాస ర్ంప్రభుయాన్నరిమ్॥ అది॥

క్షాత్రాయుగమునాటి హింద్వార్యులు.

వారు పొయినసంగతికి నేనుపొయెదగాక" యని యాతడనుచు న్నాడు. ++ తమరక్తము పరిశుబ్రమైనదని గర్వపడు శూరపురుషు లలో నిట్టిభావముండుటయబ్బురము కాదు.

   తాను వివాహము చేసికొను కన్యలు యుక్తవయస్కలై వివాహము నాడే నిషేకమునకు తగినవారుగా నుండవలయునని ఈ యుగారంభమున నుండిన యార్యులు కోరుచున్నట్టు కానవచ్చు చున్నది. ద్రౌపదీ వివాహము పంచపాండవులలొనొకనితొ నొక్కొక్కదినమున జరిగెననియు, అట్లయ్యదేవతాప్రభావమున ప్రతిదినము ఆమె కన్యగానే యుండెననియు మహాభారత మందున్నది. దీనినిబట్టి జూద వివాహవిధులలో నిషేకకారము ముఖ్యముగా నుండేననియు, వధువు నిషేకయోగ్యగా నుండుట యవసరముగానుండేననియు, తెలియవచ్చు చున్నది. వివాహ కాలమున ద్రౌపది వర్ణింపబడిన విధమునుబట్టి చూడ ఆమె తగినవ యస్సు కలదిగ నగపడుచున్నది. కుంతికి వివాహమునకు పూర్వమే పుత్రుడు జన్మించి యుండెను. వివాహమైన కొలది మాసములకే మరణించిన అఃభిమన్యుని భార్య ఉత్తర గర్బవతిగా నుండెను, అర్జునుడు సుభద్రనెత్తుకొని పోయినపుడు ఆమె నిండు జవ్వనము కలదై యుండెను. వేయేల? మహాభారతమున వచ్చిన స్త్రీలందరు నిట్టివారుగానే యున్నారు. మహాభారతమును బట్టి చూచిన, క్షాత్ర యుగారంభముననే కాక దానియంతమున గూడ ఫ్రౌడావివాహములు వాడుకయందుండినట్టు కానవచ్చు చున్నధి. రామాయణము కూడ దీనినే

++భుక్తపూర్వాంస్త్రియంయేచ నిందతామఘనంసిజాకి వ్రోణ॥

వారి వివాహములు.

బలపడుచున్నది. కాని కొన్నిచొట్ల దానియందు ఈ విషయమున తరువాతి కాలపు టభిప్రాయములు దూర్చబడినవి. ద్రౌపది స్థితియందువలెనే, సీతారాములు మిఃధులనుండి యయోధ్యకు రాగానే నిషేకనం జరిగినట్లున్నది. #

   ఈ యుదాహరనము లన్నియు క్షత్రియ వంశము వారివనియు, రాజపుత్రులలో ఆనాడే కాదు నేటివరకు కూడ పై యాచారమే యున్నదనియు కొందఱు వాదింప వచ్చును. బ్రాహ్మవివాహము ఆచారముగ గల బ్రాహ్మణజాతిలో పైనజెప్పబడిన వివాహపద్దతి యుండలేదని అట్టివారుచెప్పవచ్చునుకని అట్టివాదము సరియైనదికాదు. క్షత్రియకన్యయెంత యుక్తవయసురాక పూర్వమే పెండ్లియైన యొక బ్ర్రాహ్మణకన్యకయైనను వీరకావ్యములయందు మనకు కానరాదు. శుక్రుని కూతురగు దేవయాన మొదట కచుని ప్రేమించి యాతనిచే నిరాకరింపబడి యయాతిని వివాహమాడినట్లు మహాభారతమునందున్నది. పెండ్లి సమయమున నీమె సంపూర్ణ యౌనవతి. వృద్ధురాలగు వరకు అవివాహితగానేయుండి తపము సల్పుచుండిన బ్రాహ్మణ స్త్రీ యొకతె మనకు శల్యపర్వము నందలి 33 వ అధ్యాయమునౌకావవచ్చుచున్నది. స్వర్గమునకు బో దలచినచో వివాహమాడవలసి యుండునని ప్రబోధింపబడిన పిదప ఆమె తుదకు

  1. ఈ సందర్భమున నీ క్రింది శ్లోకము చాలముఖ్యమైనది. ఇది బహుశ రామాయణముయొక్క మూలగ్రంధములోనిదై యుండవచ్చును. అభివాద్యభివాద్యాంశ్చ సర్వారాజనుతాస్తదా । రేసునేయనతా॥ సర్వాభర్తృభి: సహితామవారికి రాజ॥

క్షాత్రాయుగమునాటి హింద్వార్యులు.

వార్ధక్యమున నొకఋషిని పెండ్లిచేసికొనెను. దండునివలన బలాత్కారముగా చెఱుప బడినదగు భృగుమహర్షి కూతురుయుక్త వయసు వచ్చువరకు అవివాహితగానున్న బ్రాహ్మణ స్త్రీయే కదా. ++అనుశాసనపర్వమునందు స్త్రీకి వివాహము కాదగిన వయసు యౌవన ప్రాప్తియే యని స్పష్టముగా జెప్పబదియున్నది.$

  వివాహకాలమున పురుషులు వయసు కూడ స్త్రీలవయసున కనుగుణ్యముగానే యుండినట్లు కానవచ్చుచున్నది. బ్ర్రహ్మచర్యము క్రమముగా పాలించబడుచునేయుండిన పక్షమున వేదములు 12, 24, 36 సంవత్సరములకాలమువరకు పఠింపబది కంఠస్థము చేయబడుచునే యుండిన పక్షమున పురుషులు వివాహము 20 సంవత్సరములకు ముందు అగుచుండగనే  లేదని మనము నిశ్చయింపవచ్చును. చిన్నతనములో స్త్రీ పురుషుల కలయిక కలికాలపు దుర్లక్షణములలో నొకటి యనియు, పూర్వ యుగములందు సంపూర్ణ యౌవనము రానివాడు స్త్రీ నెఱుగడనియు చెప్పబడుచున్నది. ^ ఈ ప్రకారముగా స్త్రీ

++ ఆదిపర్వములోని 153వ అధ్యాయమునందున్న ఈక్రింది శ్లోకమునందు ఒక బ్రాహ్మణుడు బకువ కాహారము కాబోవుచు విలప్;ఇంచుచున్నాడు. దీనినిబట్టి క్షత్రయుగాంతమునగూడ బ్రాహ్మనకన్యలు యుక్తవయసుప్రాప్తవయసమజాతవ్యంజనక్ర్తిం । భర్తరర్ధాల్యనిక్షిప్తం న్యాసంధాత్రాంహత్మనా॥

$ వవస్థాంతుమహాప్రాజ్ఞన్యామావోధుమర్షసి॥

నచస్త్రీయంప్రజనాతి కశ్చిదప్రాప్తల్యామన:॥అను॥

వారి వివాహములు.

పురుషులు సంపూర్ణవయసు ప్రాప్తించిన తరువాత వివాహము చేసికొనుచు, ఆరోగ్యవంతులగు బిడ్డలను కనుచు నుండిరి. $

  ఆచార మిట్లుండి నపుడు స్త్రీ పురుషుల వలన నొక్కొకపుడు ఆక్రమణము జరుగుచుండుట సహజము. వివాహమునకు బూర్వమే కుంతి కుమారునిగనుట ఇందునకు తార్కాణము, మహాభారతమ్లోని యొక శ్లోకమును+ బట్టి, యౌవన వతులయ్యు అవివాహితలుగా నుండిన కన్యల మానసికావస్థ పాశ్చాత్ల్య స్త్రీ పురుషుల యవస్థవలెవ్నె యుండెనని తోచుచున్నది. యుక్తవయస్కులగు స్త్రీల చ్వర్తన్ము మతము వలనను ధర్మశాస్త్రము వలనను కాపాడుబ?డు చుండెడిది. సమ్మతితోనే యైననేమి, ఒక కన్యను చెఱచుట మనుస్కృతిప్రకారము గొప్పదోషము. ఇట్టి దుష్కార్యమునకు పాల్పడిన కన్నె బ్రహ్మహత్యాదోషమున మూడవ భాగమును, చెఱచిన పురుషుడు తక్కినపాపమునుపొందునని మహాభారతము శాసించుచున్నది.++
  పై కారణమును బట్టి, క్షాత్రయుగమునాటి హింద్వార్య్లులలో వివాహములు, కన్యల కన్యాత్వమును పురుషుల బ్రహ్మచర్యమును కాపాడుటకు అవసరములగు నియమములతో

$"టాసిటసు" ఇట్లే వచించి యున్నాడు.

+ప్రధానశాంక్షిణీనాంచ కన్యానాంవయసిస్థితే । శృత్వకధాస్ధధాయక్తా: పాశకృశతరీమయా॥శాం॥

++త్రిభాగంబ్రహ్మహత్యాయా: కన్యాప్రాస్నోతిరుష్యతి: యస్తు దూషయితాతస్యా: శేషంప్రాప్నోతిపాప్మన:॥అను॥కృతము./

క్షాత్రాయుగమునాటి హింద్వార్యులు.

జరుపబడు చుండెను. తెలియుచున్నది. బాల బాలికలకు పసి తనముననె వివాహము జరుగుచుండిన ఈ కాలపు సంఘస్థితికని ఆ కాలపు సంఘస్థితికిని చాలభేదము కన్పట్టుచున్నది. బాల్యవివాహములు బౌద్ధయుగమున మన సంఘమున బ్రవేశించి క్రమక్రమముగా పెఱిగి తద్యుగాంతము వఱకు--ముఖ్యముగా క్రీ.శ.900 నుండి 1000 వఱకు స్థిరపడినవి. అనగా బాల్యవివాహములు క్షత్రయుగరంతము నాటికి మెల్లగా నారంభమైనవి. వీరకావ్యములలొ మనకీ విషయమున ప్రమాణములు దొరకవుగాని ఆకాలమందు హిందూదేశమునకు వచ్చిన గ్రీకుల చరిత్రకారుల వ్రాతలలో పైయూహకాధాముకలదు. ఏడు సంవత్సరముల బాలికలను పెండ్లియాడి వారితో గలసియున్న పురుషులు దక్షిణమున నుండినట్లును, వారు దీర్ఘాయువులు కాక 40 సంవత్సరములకు ముందే చనిఫోవు చుండినట్లును గ్రీకులు వ్రాసియున్నారు. ఈ చరిత్రకారులు తాము వినిన యంశముల నెల్లను నమ్ముచు అతిశయోక్తులు వ్రాయుచుండినట్టు తోచుచున్నది. ఒంటికాలి మనుష్యులును, చెవులతొ శరీరమునంతను కప్పికొనువారును ఈ దేశమునం దున్నారని వారు వ్రాసిన వ్రాతలెట్టివో పై యంశమునగూడ వారి వ్తాత యట్టిదిగా మనము నిర్ధార్ణ చేసికొనవచ్చును. కాని రెండు సంగతులు మాత్రము వారి వ్రాతనుబట్టి మన మూహింపచచ్చును; (1)బాలికల అతి బాల్య వివాహములును నిషేకములును ఆకాలమున అస్వాభావికముగాను, అసాధారణములుగాను తలపబడు చుండెను.

వారి వివాహములు.

(2) అతిబాల్యవివాహములు దక్షినమునందలి అనార్యులగు ద్రావిడజాతులలొ జరుగుచుండెను.

మనుస్మృతి కలలు వివాషములను ఎనిమిది విధములుగా బాగించియున్నారు. వీనిలోని మొదటి నాలుగు, బ్రహ్మ, దైవ, ఆర్ష, ప్రజాపతి పద్ధతులు, ఈ నాల్గు పద్ధతులును వివాహ పద్ధతియొక్క నాల్గు వివిధావస్థలను సూచించుచున్నవి., దేవతలు ఆర్యులకు అతిపూర్వీకులు; ప్రజాపతులు వరి తరువాత వారు; ఋషులు వారికి సమీపస్థులగు పూర్వికులు, దైవ, ప్రజాపతి, ఆర్ష పధ్దతులు పైమూడింటికిని క్రమముగా సంబంధించి యున్నవి. ఇక బ్రాహ్మవివాహము. ఇది గంగానదీ ప్రాంత్ వాసులగు బ్రాహ్మణరులలో నాచారముగానేర్పడిన అత్యుత్తమ వివాహపద్ధతి. ఈ పద్దతియందు కన్యవరునకు అనేక దక్షిణలతొ గూడ దానము చేయబడుఛుండెడిది. తక్కుంగల మూడు పద్ధతులు, వివాహము విక్రయ పద్దతినుండి దానపద్దతి వచ్చువఱకు కలిగిన దశాభేదములు. మొట్టమొదట ఆర్యులు తమ కూతుండ్లను వశ్వాదులవలెనే అమ్మదగిన వస్తువులుగా దలచుచుండిరి. ఈ యభిప్రాయము అసుగులనబడు పురాతన ఇరానియనుల యందు (పారసీకార్యులయందు) విశేష వ్యాప్తి కలిగి యుండినందున దానికి అసుర వివాహమని పేరువచ్చేను. గ్రీకులు మన దేశమునందుండిన కాలములో నీ యాచారము పంజాబు దేశమందలి కొన్నితెగలలో నుండెను. వీరీ యాచారమును సింధునది యావలి గట్టునుండి వచ్చిన కాలమున తమ వెంటదెచ్చికొని ఇంకను మఱువక యట్లే యుంచుకొని యుందురు. మాద్రియు,

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.

కైకేయియు, గొప్పగొప్ప బహుమానములకు ప్రత్యామ్నాయము వరుసగా పాండురాజునకును, దశరధునకును లంబించిన యండుట మన మెఱుగుదుము. మాద్రేయులు, కేకయులు పంజాబునందు వసించుచుండిన పూర్వోక్తములగు తెగలవారు. అలెగ్జాండరుతొగూడ మన దేశమునకు వచ్చిన వారు సయితము "తక్షశిల"లో నిట్టి యాచారమునే కనుకొగి యుండిరి. "తక్షశిలయందు యౌవనురాండ్రగు కన్నెలు విక్రయమునకై యుంచబడుచుండిరి. కొనువారు ముందునకు వచ్చినపుడు వారి భుజములమీది బట్టతీసి చూపుచుండిరి. అందఱికన్న నెక్కువ ధన మిచ్చిన వానికి కన్నెవిక్రల్యింపబడు చుండెను." అని 'ఏరియను ' వ్రాసియున్నాడు. స్కృతి వాక్యానుసారము ఈ పద్ధతి చాల హీనమైనది; ఇట్టి వివాహములు అరుదుగా కొన్ని స్థలములలో మాత్రేమే కానవచ్చుచుండెడివి. అలెగ్జాండరు కాలమున మన దేశమునందు "కాధయులు" ను "సొపైతియులు"ను భిన్నములగు వివాహాచారములను కలిగియుండిరట. వీరు వీరయుగమునాటి "కేకయులు"ను "మాద్రేయులు" ను నై యుండవచ్చును. ఈ రెండు తెగలలో "కాధయ" స్త్రీలుతమ భర్తలను తామే నిర్డేశించుకొను చుండిరి. "సొపైతి" స్త్రీలు వెలల కమ్మబడుచుండిరట. వీరిలో వరదక్షిణయను మాటయే యుండలేదట.*

      ఇక స్వయంవర పద్ధతిని గూర్చి విచారింతము. ఇది రెందు విధములుగా నుండెను. వధువు తన యిష్టమువచ్చిన

  • "అలెగ్జాండర్ల్;ఉని హిందూదేశపు దండయాత్ర" మాక్ క్రిండిల్

వారి వివాహములు.

వరుని వివాహము చేసికొనుట మొదటిది; వరుడు తన బాహుబలమును ఏదైన పొటీయందు ప్రదర్శించి వధువును వివాహ మాడుట రెండవది. వీనిలో మొదటి పద్ధతి "గంధర్వ"లను అనార్యజాతివారి యనుకరణమున ఆర్యులలో ప్రవేశించి యుండును. మహాభారమందలి గాంధర్వ్ఫ వివాహములలో ఆదర్శ మనదిగినది శకుంతలా వివాహము. రెండవపద్ధతి ఆర్యక్షత్రియులకు మిగుల ప్రియమైనదిగానుండెను. రాచకన్నెవ్లు బెండ్లియాడు కుతూహలమున పలుమారు బ్రాహ్మణులుకూడ నిట్టి పందెములందు తమ బాహుబల ప్రదర్శనము చేయుచుండిరి. బలమును చూపుటకు సాధనము ఆకాలమున ధనుర్విధ్యయే. ద్రౌపదీ పాణిగ్రహణర్హత అట్టి విద్యనుబట్టియే నిర్ణయింపబడేను. పై యాచారము క్షాత్రయుగాంతమున గూడ నుండినట్టు గ్రీకు చరిత్రకారులు వ్రాసియున్నారు.*

   రాక్షస వివాహముకూడ తఱచుగా క్షత్రియులలోనె జరుగుచు బాహుబలోత్తేజమూనకు సహకారిగానుండెను. ఈ వివాహమునందు క్షత్రియుని కూతురును ఆమె కిష్టముగ నుండినను సరే లేకపోయినను సగే పురుషుడు బలాత్కారముగా లాగికొని పొవువును. వధువు బంధువు లాతని నెదిరింతురు, వరుడే వారి నోదించినచో వధువు అతని భార్యయగు చుండెడిది. సుభద్ర వివాహమిట్టిదే. మహాభారతమును బట్టి చూచినచో ఆమె మన:పూర్ఫకముగా నర్జును వెంట బోయినట్టు కానరాదు. సుభద్రబంధువులగు వృష్ణువులు అర్జును నెదిరింప దలచిరి;

  • "మెగాస్థనీసు మఱియు ఏరియను" మాక్ క్రండిల్ కృతము

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.

కాని కృష్ణుడు వారి యావేశము నడచి, అట్టి ప్రయత్ంహము వ్యర్ధమని బోధించి వారిని వారించెను. సీతాపహరణముకూడ నిట్టిదానిలొదే కాని యామె అంతకు ముందే వివాహితయై యుండెను. ఆలొచించి చూచిన పక్షమున వధూహరణము వివాహితల విషయమున గూద్?అ జరగుచుందెనని తోచుచున్నది., వివాహితలను లాగికొనుపోవు నాచారము రాక్షసులలోనిదై యుండవచ్చును. "అభుక" స్త్రీలను వివాహమాడుట ముఖ్యోద్దేశముగాగల ఆర్యు లిట్టి యాచారముకలిగి యుండుట మనకు విరుద్ధముగానే కానవచ్చును. పాండవు లరణ్యవాసము చేయుచుండిన కాలమున నొకనాడు ద్రౌపదిని జయద్రధుడు ఎత్తుకొని పొయినకధపై యట్టివివాహమునకు మఱియొక యుదాహరణము. ఈసందర్భమునధౌమ్యుడు పలికిన వచనము ఆకాలపు మర్యాద పైనకొంత కాంతిని ప్రసరింపజెయుచున్నది. "మహారధులగు నాపెభర్తలజయించికాని నీవామెను తీసుకొని పోజాలవు; జబద్రధా! పురతనమగు క్షత్రియ్ల ధర్మమును పాలింపుము" అని ధౌమ్యుడనెను ++దీనిని చూడగా వివాహితలను గూడ, వరి భర్తల నోడించి ఎత్తికొని పోవుట క్ష్లత్రియధర్మముగా నుండినట్టు కానవచ్చుచున్నది.

   పైశాచవివాహాచారము మనుష్యమాంసము దినుచుండిన పిశాచులను అనార్యజాతియండుండెనని మనమూహింప వచ్చును. ఈజాతివారియందు వివాహపద్దతిలేక పొవుటయేకాక

++సేయంశశ్యాత్వయాసేతు మవిజత్యమహారధాన్ ।ధర్మంక్షత్రిస్య పౌరాణ మపేక్షస్వయబద్రధ॥ వన ॥

వారివివాహములు.

బలాత్కారముగాగాని ప్రచ్చన్నముగాగాని సంభోగించుట యభ్యాసమై యుండెను. ఈ ప్రకారముగా సంభోగింపబడిన స్త్రీ అట్టిపురుషుని భార్వకావలసి వచ్చుచుండెను. స్త్రీల పాతివ్రత్యమును కాపాడుటకై, ఈపద్ధతిని ఆర్యులుకూడ అరుదుగా అవలంబించి యుండిన నుండవచ్చును.

    పైన జెప్పియున్న వివాహములు ఆకాలమున ఆర్యులలోని వివిధజాతులయందును అనార్యులలోను పరస్పరాను కరణము వలన సహవాసకారణము చేత జరుగుచుండెననుట నిస్సంశయము. ఇట్టి సహవాసమున నుద్భవించిన యనేక నిర్భంధమువిధులు మనకు కానవచ్చుచునేయున్నవి. ఆగ్రేజాతులవారు క్రిందిజాతులవారి కూతుండ్లను పెండ్లియాడవచ్చును కాని క్రిందిజాతులవరు పైజాతుల స్త్రీలను పెండ్లిచేసికొనగూడదు. ఈనియమమునకు విరుద్ధముంగా జరిగిన వివాహమువలన జనించినసంతానము తుచ్చమైనదిగాతలపబడు చుండేను. తాము శూద్రస్త్రీలను వివాహమాడగూడదని బ్రాహ్మణులు విధించుకొనిరి. కాని మహాభారతమున పలుతావుల శూద్రస్త్రీని పెండ్లియాడినభ్రాహ్మణులు నిందింపబడి యున్నారు. వీరికి "వృషలీపతు" లని పేరు. ఇట్తిపురుషుడు దోషియనియు బ్రాహ్మణత్వమునకు దూరగుడనియు నరకగామియనియు చెప్పబది యున్నాడు. కాని వీనిసంగతి కెట్టిన్యూనతయు చెప్పబడి యుండలేదు. జయద్రధును జంపుదునని అర్జునుడు చేసిన శపధమున, తానట్లు చేయనిచో "వృషలీపతిపొందుదుర్గతిని పొందెదనని"  అతనివచనము కలదు.

వెనుక మేము చెప్పిన ప్రకారము క్షాత్రయుగారంభము

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.

నాటికి ఆర్యులు వివాహపద్దతిని ఏర్పరచుకొనియే యుండిరి. కాని అది యింకను వారిచుట్టునున్న అనార్యజాతులలోకేవలము ఆరంభదశయందేయుండెను. ఉదాహరణార్ధము ఉత్తరకురుదేశస్థులు #పాండవుల కాలమున ఇంకను వివాహము చేసికొనుచుండనేలేదు. ఈయంశమునుబట్టియేకాబోలును "హిరోదోటసు" అను గ్రీకుచరిత్రేకారుడు "హిందువులు పశువులవలె బహిరంగముగా సంభోగించెదరు" అని అతిశయోక్తితో వ్రాసినాడు. బహుభార్యాత్వబహుభర్తృత్వ నియోగములు ఆర్యులందుండెను. బ్రాహ్మణులందు వివాహములు క్రయవిక్రయదశనుండి కన్యాదానదశకు వచ్చుచుండెను. క్షత్రియులలో స్వయంవరపద్ధతి హెచ్చుచుండెను., నల్లనివర్ణముగల యాదిమ నివాసులతొ సంపర్కము కలిగినందున అర్యులలో స్వీయజాత్యభిమానము మెండై ప్రతిలోమ వివాహనిషేధమువంటి నియమము లెర్పడసాగెను. "అభుక్త" స్త్రీలుమాత్రమే వివాహయోగ్యులుగా నెంచబడుచుండిరి. వితంతువులు అల్పజాతులతో పునర్వివాహము చేసికొనుచుండిరి. బాలవివాహములు బొత్తగానే లేవు. వెనుక చెప్పబదిన ఆచారముల వివాహపద్ధతులు క్షాత్రయుగము నం


  1. అనావృతాణిలపురా స్త్రీయసన్ నరాననే । కామచారావిహారిజ్య॥ స్వతంత్రాశ్చారుహాసిని॥

రమాణదృష్టోధర్మోయం పూజ్యతేచమహర్షిభి॥ । ఉత్తరేషుచరంభోరు కురుష్వద్యాపిపూజ్యతే॥అది॥

ఉత్తరకురుదేశస్ధులు తిబెతీయు లెయైనపక్షమున ఈవచనము ఇప్పుడును వారికి వర్తించుచున్నది.

వారివివాములు.

దంతట నుండెననుమాట నిజమేయైనను, బ్ర్రాహ్మణవివాహములు ఏకపత్నీవ్రతము, వితంతూద్వాహనిషేధము మొదలగునవి జనుల హృదయము నాకర్షించుచుండెను. క్షత్రయుగారంతమున ఎద్దులజతకు కన్యను విక్రయించుటయు, పోతెయందు చూపబడిన బాహుబలము ననుసరించి కన్యనిచ్చుటయు వర్ణాంతర వివాహ నిషెధమును వాడుకయుందుండెను.

క్షాత్రయుగమునందు భార్యలదశ యెట్టిగానుండేనో విచారింతము,. యీయుగము తదుయందున్న దానికంట్ఘె ఆరంభమున భార్య లెక్కువ స్వతంత్రశీలురాండ్రుగను ఎక్కువ గౌరవనీయరాండ్రుగజ్ను ఉండుటసహము. వివాహసమయమున యౌనవంతులైయుండు కాలమునను కానుకలకు ప్రత్యామ్నాయముగా నివ్వబడుచుండుకాలమునను, స్వయం వరణమాచారముగా నుండుకాలముననను తమ భర్తలనువదలి మరల వివాహముచేసిమొను నధికారముండిన కాలమునను వారు పదక్షణముగ కన్యాదానము చేయబడు చుండినట్టి భర్తతప్ప వేఱుదిక్కులెక యుండినట్టి కాలముకంటె నెక్కువస్వతంత్రము ననుభవించిరనుట స్వతస్సిద్ధము. ద్రౌపదితానుస్వయముగా ననుభవించిన స్వాతంత్ర్యమునకును, పతివ్రతయగు స్త్రీ యిట్టిదిగ నుండవలయునని ఆమె (వనపర్వములోని వర్ణనము ప్రక్షిప్తమనుట కష్టము.) ఈ వర్ణనము క్షాత్రయుగాంతమున భార్యయగు దాని కుండవలసిన లక్షణములను జూపుచున్నది. ఈయాదర్శమే

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.

నేటికిని మఱింత వికృతాకారముతో మన యిండ్లయంద్సున్నదని వేఱుగ జెప్పవలయునా?

  వ్యాసుని ద్రౌపది ఎట్టిదో చూడుడు:- వివాహంకాలమున ఆమెయౌనవతి శరీరార్డ్యము మనోబలముకలది. ఆమె పాణిగ్రణము చేయుటకై కాంపిల్య నగరమునందు సమావేశులైయున్న రాజన్యుల సభయెదుటికి నిర్భయముగా వచ్చెను. కర్ణుడు మత్స్య యంత్రమును దెగవ్రేయుదలచి ముందడుగిడ అనంతధైర్యముచెడక కొద్దిజాతివానిని నెను పెండ్లియాడనని నిర్భయముగా వచించెను. బ్రాఃహ్మణవేషముననున్న వాడొకడు తన ధనుర్విద్యాకౌశలమును చూపి  గెలుపొంద ఆమె సంతోషపూర్వకముగా బీదయింటికి పోయెను. తానెదుటలెని సమయమున తన్నుద్యూతమున నోడినపుడును, దాసిగా ద్యూతగృహమునకు దీసికొనిరాబడినపు డును ఆమెతాలిమి గోలుపోలేదు. తనవిపనావస్థ కించుకేనియు తత్తరముచెందక ధర్మశస్త్రానుసారము తన్నోడుట క్రమమా యక్రమమా యను విషయమున నామె చేసినప్రశ్న ఆమెశాస్త్రజ్ఞానమును ప్రకటించుచున్నది. పలుమారు ఆమె "పండితో యనియు "బ్రహ్మవాదిని" యనియు మహాభారతమున పిలువ్బడి యున్నది. వనవాసకాలమునందామెభర్తలతో రాజ్యాంగవిషయములందు తర్కవితర్కముల సల్పెను. వారి కాలోచన చెప్పను. విరటుని యంత:పురమున సైరంధ్రిగా నుండినకాలమున ఎంతోదైర్యముతొ వర్తించి అజ్ఞాతవాస నియమమును జయప్రదముగా గడపెను.

ఇక క్షాత్రయుగాంతమున ద్రౌపదినోటనెచెప్పింపబడిన

వారివివాహములు.

ఉత్తమరాలగు భార్యలక్షణములను గమనింపుడు. వనపర్వములోని 263 వ అధ్యాయమున ఆమె సత్యభామతో తాను భర్తల సంతోషపెట్టుచుండిన విధమును ఇట్లుచెప్పుచున్నది. "గర్వమును కోపమును వదలుకొని నేను సదాభర్తలకును వారి భార్యలకును సేవచేయుచుందును. తప్పుమాట మాట్లాడుటకును తప్పుగానిలబడుటకును తప్పుగా చూచుటకును అమర్యాదగా గూర్చుండుటకును చెడ్దస్థలములకు బొవుటకును నాభర్తల యుద్దేశముల నూహించుటకును భయపడుచుందును. నేను పరపురుషుని కన్నెత్తిచూడను అతడు దేవుడైననుసరే, యౌవనుడైనను సరే, ధనికుండైననుసరే, సద్వర్తనుడైననుసరే, భర్త భుజింపనిది నేను భుజింపను. ఆయన నిద్రింపనిది నేని నిద్రింపను, భర్త పొలమునుండిగాని, యడవినుండిగాని, గ్రామమునందుండికాని తిరిగివచ్చునప్పుడు *నేను నిలబడి నీరొసగ పీఠమువేసెదను. పాత్రలునున్నగాదోమి అన్నముచక్కగావండి, వేళకు భర్తకమర్చెదను. ఆహారపదార్ధములను బాగుగా గాపాడెదను. ఇంటిని శుభ్రముగా మార్చెదను. చెడ్డస్త్రీల సహవాసముచేయను. సొమరితనమునుమాని సర్వదాబర్తలను సంతోషపెట్ట యత్నించు చుండును. ఎకసెక్కమాడను, నవ్వను, గృహద్వారమున నిలువబడను. బహిరంగప్రదేశములకు తఱుచుగాబోను. ఇంటి యావరణములో చాలసేపు నిలువను. కుటుంబపోషణముకొరకు భర్తదేశాంతరము పోయినపుడు అలంకారముచేసికొనను. భర్త


  • ఇచ్చట ద్రౌపది రాజపత్నిగా మాట లాడటంలేదు. చదువరులాలోచింతురు గాక.

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.

తినని వస్తువులు నేనుతినను. ఆయనత్రాగని పదార్ధమును నేను త్రాగను. వంశాచారములను జాగ్రతతో నడుపుదును. కోపావేశాము ననున్నను సర్పలకువలె భర్తలకు భయపడి వారిసేవచేసెదను. పసుల కాపరులు మొదలుకొని అందఱుసేవకులు చేయుబనులను నేను విచారించుచుందును. నేనుమాయత్తను సంతొషపెట్టుచు ఆమెకు అన్నపానముల నమర్చు చుందును. వేషమునందు నేనామెను మించను. బ్రాహ్మణులకును అతిధులకును జాగరూకతతో సేవచేసెదను. స్వసుఖమును పరిత్యజించి రాత్రెందినములు కష్టపడి కర్తవ్యములనెరవేర్చుచుందును. భర్తలకంటె ముందునిద్రలేచి వారు నిద్రించినతరువాత నిద్రింతును. భర్తలు నన్ను ప్రేమించుటకై నేను చేయుచున్న మంత్రిప్రయోగమిదియే"

కుటుంబ విషయమునకు భర్తవిషయమునను భార్య ఎట్లునడచుకొనవలయునో చూపుటకు ఈవర్ణనబాగుగ సేయుచున్నది. కాని ఇదితగినంతయున్నతముగాలేదు. సుఖదు:ఖములందును అతనికి సయాయముచేయు ఆదర్శభార్యము తగినట్టులేదు. అయినను ఈయాదర్శము హిందూ స్త్రీని సుఖముకలదానినిగాను కుటుంబమున కుపకారినిగాను చేయుటకును, ప్రాప్తించిన దానితొనే సంతృప్తగా జేయుటకును చాలియున్నది. హిందూ స్త్రీలపావిత్ర్యము సుప్రసిధ్దము. సీత, సావిత్రి, దమయంతి, ద్రౌపది వీరి యుదాహర ణములు హిందూవనితలకు సద్వర్తనమును పొగడ

వారివివాహములు.

లేదు. హిందూయువతులు తమప్రేమను ఎవనికైననుసరే ఏనుగువెలకమ్ముచుందురని వారు వ్రాసియున్నారు. *కొందఱు చాకిరి ఛెయించుకొనుటకును, మఱికొందరు స్వసౌఖ్యముకొఱకును, గృహములను పిల్లలతో నింపుకొనుటకును హిందువులు పలువురు స్త్రీలను పెండ్లియాడెదరని వారభిప్రాయ పడినారు. "కనుక బలవంతముగా నిర్భంధమున నుంచిననేకాని వారు వ్యభిచ రింతురు."అని వ్రాసియున్నారు. $ నిర్భంధమున నుంచబడినస్త్రీలు దుర్వర్తనమునకు పాల్పడియుండుట క్షాత్రయుగమున సంభవించి యుండవచ్చును. వేలసంఖ్యగల కృష్ణుని భార్యలను అర్జునుడు వెంటకొనిపోవునపుడు వారిలోకొందఱిని కిరాతులెత్తుకొని పోవుటయు కొందఱు తమఇష్టానుసారమే వారివెంటబోవుటయు మనకు మహాభారతమున గానవచ్చుచున్నది. కనుక ఇట్టియుదాహరణముల నెచ్చటనొచూచి గ్రీకులు పైవిధమున వ్రాసి యుందురేమో గ్రీకులు పంజాబుదాటి రాలేదు. కనుక వారు స్వయముగా నెఱిగినదా దేశమునుమాత్రమే. కనుక పంజాబుదేశపు చిత్తస్థయిర్యమును స్వతంత్రశీలమును కల స్త్రీలను జూచి గ్రీకులు హిందూదేశపుస్త్రీల పావిత్ర్యము విషమున దురభీప్రాయపడి యుండవచ్చును. ఆకాలమున హిందూస్త్రీలస్థితికి పంజాబులోని స్త్రీలస్థితికిని చాలభేదముండెను. అంతేకాక స్వాతంత్ర్యము ననుభవించు స్త్రీలనీతివర్తనమును గుఱ్ంచి జనులకు తప్పుడభిబప్రాయము జనించుట మనదినములలో


  • "మెగస్థనీశు మఱియు ఏరియను" మాకి క్రిండల్ కృతము.

$ " " "

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.

గూడ కానవచ్చుచున్నది. అట్లే గ్రీకులు మన స్త్రీలవిషయమున నపోహపడియుందురు.

   గ్రీకుల కాలములో సహగమనమున ముండినట్లు వారి వారి వ్రాతలవలన గానవచ్చుచున్నది. "కాధియను" స్త్రీలుతమ మృతభర్తల చితిపైనెక్కి కాలి చచ్చెదరని వారు వ్రాసియున్నారు. ఇంతటిస్వార్ధత్యాగముతోను మనస్త్రీలు తమయుసురుల బాయుట కారణము కనుగొనజాలక వారు "భార్యలుతమ భర్తలకు విషప్రయోగము చేయకుండుటకై హిందువులు ఈ యాచారమును సంఘమున ప్రవేశపెట్టిరి." అని వ్రాసిరి. *మనస్త్రీల వర్తనమును గుఱించి దురభిప్రాయమపడినవారగుటచే వారిట్టియూహనుపన్నిరి. "మాక్ క్రిండల్" అనునతడుసహగమనముగూర్చి యొకచోట "దయదొరను" అనునాతనిఈక్రిందివచనము నుల్లేఖించి యున్నాడు."యూమనను అంతిగొనుసు అనుప్రదేశములకు నడుమనుండు గాబీసునందుజరిగిన సమరములో నిహతుడైన "కెరియను" అనువానిభార్య లిరువ్చురును భర్తతో సహగమనము చేయుగౌరవము తనకబ్బవలెను తనకబ్బవలెను అనివివాదపడిరి. వారిలోపెద్దది గర్భవతిగానుండుటచేత ధర్మశస్త్రములు ఆమె మరణము నంగీకరీంపలేదు. "హొందూ స్త్రీలు తమభర్తలవెంట తాము మన:పూర్తిగా మరణింతురు" అనిఅరిస్టాబ్యులసు మున్నగు చరిత్రకారులు వచించిరని "స్ట్రాబో" వ్రాసియున్నాడు. కనుక ఈయాచారము అలెగ్జాండరుని దండయాత్రకు చాలాకాలము ముందునుండియే మనదేశమున నుండ

  • "అలెగ్జాండరుని హిందూదేశపు దండయాత్రె, మాక్ క్రిందిలొకృతము.

వారివివాహములు.

వచ్చును. ఏలయన ఎంతోకాలమునుండియుందినవేకాని పైదండయాత్రనాటికి ఇది ఆచారముగాను పుణ్యకార్యముగాను స్థిరపడి యుండదు. అయినను క్షత్రయుగారంభమున నీయాచార ముండెనో లేదో స్పష్టముగా కానరారు. మాద్రి సహగమనముచేసెనని మహాభారతములో నున్నది. కాని పైనవచ్చిన "కాధియసు" లే మాదేయులని వెనుక చూచియున్నాము. కనుజ్క వారియందుండినయాచరము హిందూదేశమునందంతట నుండెనని చెప్పజాలము. కృష్ణునిభార్యలలో కొందఱు సహగమనము చేసినట్తు భారతమున నున్నది. కాని ఇదిప్రక్షిప్తమేమో యని సందియమగుచున్నది. ఏలయన, దుర్యోధనునిభార్య లెందఱో ఉండినట్లున్నది కాని వారిలోనొకతయైనను సహగమనముచేసినట్టు లెదు. అంతమాత్రమున క్షాత్రయుగారంభముననీయాచారము లేదని రాయిగ్రుద్ది చెప్పజాలము. అయినను, ఈయుగాంతమున మాత్రము పైయాచారము సంపూర్ణదశనంది యుండెనని గ్రీకులవ్రాతలు చెపుచునే యున్నవి. కనుక సహగమనాచజరము సిధియనుల దండయాత్రలతోబాటు క్రీ.పూ.రెందవశతబ్ధమున మనదేశమున ప్రవేశించినదను దత్తుగారి సిద్దాంతము నిలువజాలదు.

                            ---=-