అడిదము సూరకవి/ఎనిమిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

ఎనిమిదవ పకరణము

శాపానుగహసమర్థత.


 చ. గడియకు దూఱుపద్యములు - గంటము లేక రచింతుదిట్టుగా
దొడఁగిలినా ఫలాలుమని • తూలిపడున్ గులశైల జముల్
విడువక సుగ్రహించి నిరు , పేదధనాధి పుతుల్యుఁజేతు నే
నడిదముపొడ సూరిన ప , మాఖ్యఁడ పోకుండు నాటియే.

సూరకవి చాటుధార.


పదునెనిమిదవ శతాబ్దమునఁ గాఢప్రబంధ రచనకు ప్రసిద్ధి కెక్కిన కవి వరులలో నొకఁడనియు, లాక్షణికుడనియు, సూరకవికిఁగల ప్రసిద్ధి యటుండ నతనికి(దిట్టు కవి త్వము గూడ గొప్ప పేరు వచ్చినది. " సూరకవితిట్టు కమనాలిసుత్తి పెట్టు ” అని లోకమున నిలిచియున్న పలుకులే మీఁది యంశమును వేనోళ్ళల జూటుచున్నది. అంతియగాక పిండిపోలు లక్ష్మణకవి తన "లం కావిజయము"న.

 క. " తెలియ విమురాదు క్యూ
తులు సూరకవి ప్రముఖపృ • ధుపది భావం
శులు భీమశ్రీనాధుల్
వెలియగ నాకరణిఁ దిట్ట - లేరూఢమతి . "

, అనితిట్టు కవిత్వమునకుఁ బ్రసిద్ధి కెక్కిన ప్రాచీన కవివరులతో పాటు సూరకవినిఁ గూడఁ బేర్కొని యున్నాడు. శాపానుగ్రహముల రెంటిలోను మొదటి దానికిగల నిదర్శనములు రెండవ దాని కుండినట్టుగ నీకవివరుని జీవితము ననుసరించి చెప్పుటకు నాధారములఁ గానరానందున వేములవాడ భీమకవి మొదలగు పాచీనకవులవలె 'మొకటఁ దిట్టటయుఁ బిదపనను గ్రహించుట యు నీతని పట్ల లేదేమో యని తోఁచెడిని. కాని తపఃప్రభావ : సంపన్ను డగు నీతనికి నట్టి ప్రభావముండిన సుండవచ్చునని " "విచువకను గ్రహించి నిరుపేదనాధిపు తుల్యుఁజేతు" వను .. వాక్యము సందియమును గలిగించుచున్నది. సూరకవి నిండు జవ్వనమున నుండి కవితాసామర్థ్యముచేఁ దనకీర్తి చంద్రి కల దేశమునందు వ్యాపింపఁ జేయుకాలమున నే యడిదము రామకవి : తన వాక్పటిమచే గంగాభవానిని నోడించి యీయడిదము వంశమునకు నొకయద్భుతమగు కీర్తిదెచ్చెను. అట్టికీర్తితి కొలఁది దినములలో నే, కవితావృత్తిచే నెల్లెడలఁ జేరుడయుచున్న సూరకవి నాశ్రయించిన దాయెను. సహజమగు తన సామర్థ్య - మునకునిది తోడుగాఁగ ఇతనికిఁ దిట్టు కవిత్వవిషయమునఁగీర్తి హెచ్చు కాఁజొచ్చెను. వేయేల ! ఆకాలమున సీతని . యెడల జనసామాన్యమునకు భక్తికంటె భయమేయెక్కుడుగనుండెను. సూరకవి తిట్టు కవిత్వముతో సంబంధించిన కొన్ని ముచ్చటల : విచ్చటఁ జెప్పుచున్నాఁడను. .

1. ఒకానొకప్పుడు, ఆళ్ళ సరవయ్య యను పేరుగలయొక కోమటి యింట వివాహముజరిగెను. కవితా సంభావనను గై కొనుటకయి సూరకవి యాకోమటి యింటికిఁబోయి యుండెను. అంత గృహయజమానుఁడు సరవయ్య " బాబూ ! సూరకవి గారూ ! రేపటి యుదయమున దయ చెయ్యండి. కట్నము దాఖలు చేసుకుంటాను. ” అనియెను. సరవయ్య కోరిక చొప్పున మ ఆునాఁటి యుదయమున స్నాన సంధ్యాద్యనుష్ఠానములు నిర్వర్తించుకొని సూరకవి వాని యింటికిఁ బోయెను. "బుద్ది: క ర్మానుసారిణీ ” యనునట్లు సవరయ్య వీణ్ని పాంగర ; బాప నాడు దాచ పెట్టినట్టు పొద్దుటే పౌరొచ్చేడు ”అని సూరకవిని దిట్టెను. ఆపరుషోక్తులు విని సూరన మిగులఁగుపితుఁడై "ఆపామే నిన్నుఁగఱవ అయ్యో సరవా! "అని శపించెను. తిట్టుటయె తడవుగ నొక ' కృష్ణసర్పమింటి ముంజూరు , దూలమునఁ జేయానుకొనియున్న సరవయ్యను బొడిచి విగత పాణుని జేనెను. అట్టి యద్భుతమున కచ్చటనున్న వారందఱు కలవరపడి చేష్టదక్కి యుండిరి. ఆ సర్పము మాత్రమచ్చటనున్న వారల సేవ్వరి నేమియుఁ జేయక తన దారిని బైటకుఁబోయెనఁట !

2. ఒకప్పుడు సూరకవి చీపురుపల్లి నుండి శృంగవరపుకో టకుఁ బోవుచుండెను. మార్గమధ్యముననున్న ద్వారపూడియను గ్రామమునకుఁ బోయి నాలుగైదు యిండ్లకడఁ దాగుటకుమజ్జిగ నడిగెను. అది యెట్టిపాపమో గాని యొట్టుఁ బెట్టినట్టు కవికిఁ జల్లబొట్టు దొరకదయ్యెను. తానేఁగిన యిండ్లకడఁ బాడియుండియుఁ దనకు వార లీయనందులకు వగచి "దూరమైపోయెరా పొడి ద్వారపూడి "యని యొక శాపవాక్యమును పలికెనఁట. ” దీనికిఁదగినట్టుగ నాఁటిసాయంకాల, మాయైదారెండ్లకడ నావులు గంటెఁడు పాలైన నియ్య లేదఁట ! గృహయజమాను లట్టివింతకు సూరకవి శాపమే కారణమని యెంచి క్షమింపుమని సూరకవి ని వేఁడుకొన యథాప్రకారముగ మఱునాఁటి నుండియునావులు పొలిచ్చు చుండెనఁట ! (ఈవింతను సూరకవి శాపానుగ్రహ ముల "రెంటికిని దార్కా ణముగఁ జెప్పినను జెప్పవచ్చును.) -

3. సూరకవికి 'చీపురుపల్లె 'యందుఁ గొందఱు శిష్యు లుండిరని మూఁడవ ప్రకరణముననే వాసియున్నాను. ఆ విష యమునుఁ దెలియఁజేయుపద్యములోని కడపటి పాదమిట్లున్న ది. “ ధీరుఁడై నిలిచె మురపాక నూరఁడొకఁడు ” ఒక్క మురపాక సూరన మాత్రము తన శిష్యులలో నుత్తముఁడనియు, స్థిరముగ విద్యగరచెననియుఁ గవిగారి యభిప్రాయమై యుండ దైవమా పద్య పాదార్థమును వేఱుగ గ్రహించుటచే మురపాక సూరన్న గారి సోదరులు నలువురలోను సతఁడు మాత్రము మిగిలి తక్కి నవారు స్వర్గస్థులైరట ! (ఈపద్యమును జెప్పుటలోఁ గవియు దేశము జరిగినదానికి భిన్నముగ నుండినను బదములగూర్పుచే నొక విపరీతమగు నర్థము గలిగెననియు దాని పర్యవసానముగనట్లు జరి గెననియుఁ జెప్పుదురు.) ఇట్టి వింతలింకను నీకవిని గూర్చి పెక్కులు చెప్పుదురు గాని యవి యెంతవఱకు. విస్రంభ పాత్రములో చెప్పఁజూలను. ఏదియెట్లున్నను సూరకవికి మాత్ర ము తిట్టుకవిత్వమునబ్రఖ్యాతికలిగి యుండెనని చెప్పుటకు సందియము లేదు.

'గడియకు నూఱుపద్యములు గంటను లేకరచింతు' అను వాక్యమును బట్టి సూరకవికి నాశుకవిత్వమున గొప్పసామర్థ్య ముండెనని మనమూహింపవచ్చును. దేశాటనము' (ఆఱనప ! కగణము) కింద నియ్యఁబడిన వీరఘట్టాము వృత్తాంత మాతని యాశుకవితా సామర్థ్యమును వెల్లడిచేయు చున్నది. ఇంతియ గాక శతసంఖ్యాకములై యాంధ్ర, దేశమున నిలిచి యున్నయీ కవివరుని చాటు పద్యరత్నములు గూడ సద్దానికి సాక్ష్యమిచ్చుచున్న పని నాయభిప్రాయము.