ఉత్తరభాగము - ఆ. 5.
355
క. విను వారలకుం జెప్పిన, ఘనబోధనులకు నశేషకామ్యస్వర్గా
ద్యనుపమశుభంబు లిచ్చును, మునిసేవిత మిక్కథాసముచ్చయు మెందున్.113
వ. నీపు గౌరవాన్వయపావనుండవు గావున నర్హుండవు వినుము వాసుదేవుండు దేవా
రాతుల నరకుండు తుదగా నందఱం దునిమి యశేషహితం బొనర్చి యిచ్ఛాను
రూపంబు లగుకేళీకలాపంబుల నలరుచుండ నొక్కనాఁడు పుణ్యరజనీసమయంబున
రుక్మిణిశయ్యాతలంబునం బ్రీతుండై యెద్దే నొక్కవరం బడుగు మనిన నాయమ
యి ట్లనియె.114
రుక్మిణీదేవి శ్రీకృష్ణునితోఁ దనకుఁ గల సంతానాపేక్ష యెఱింగించుట
క. తనయులఁ బ్రద్యుమ్నాదులఁ, గనియుఁ దనియ దాత్మ కొడుకుగములను నానా
ధనధాన్యములం దనిపిన, జనములు లేరందు రది నిజంబు మనోజ్ఞ.115
వ. అ ట్లగుట రూపసియు బలియుండును విద్యావినతుండును శ్రీమంతుండును నై
తేజంబున నిన్నుఁబోలుపుత్రు నింక నొక్కనిఁ గోరెద ననిన నల్లన నవ్వి యవ్విభుండు.116
క. విను మఖిలలోకసుఖములు, ననంతములు పుత్రవంతు లగుపుణ్యులకున్
దనయవిహీనులు దుఃఖులు, తనూజలాభంబు పరమధన మని రార్యుల్.117
తే. పతియ చూవె భామినియందుఁ బట్టి యనఁగఁ, బుట్టుఁ బదియవునెలఁ బుత్రభూతిఁ దనియు
వాని కింద్రుఁడుఁ దలకు నెవ్వారలకును, వెఱవఁ డాత్మజోపేతుఁడు మెఱుఁగుఁబోఁడి.118
క. నీవడిగినట్టిపుత్రుని, నీవచ్చు లతాంగి తొల్లి హిమగిరిఁ దప మేఁ
గావించి కంటి నుత్తము, భావునిఁ బ్రద్యుమ్నుఁ దొలుతపట్టి నుదారున్.119
వ. తపంబునకు నసాధ్యం బైనది లేదు. అవ్విధంబునన యింకను శంకరారాధనంబు
సేసి కొడుకు బడసెద నేను వోయి రజతాచలంబున నచలకన్యాసమేతు నాభూతే
శ్వరుం దపస్సన్నిధి నునిచి తపంబును బ్రహ్మచర్యంబును నస్ఖలితంబులుగా నడుప
జగన్నథుండు ప్రసన్నుండై యెల్లవిధంబుల నస్మన్మనోరథంబు నొసంగు నాది
దేవుండు నజమహేంద్రాదివంద్యుండు నగునయ్యిందుశేఖరు దర్శించి నమస్క
రింపం గనుట యొక్కటియును నడుమ బదరీవనంబున ననవరతతపోనియమ
వ్రతసిద్ధులు నఖిలసిద్ధాంతదర్శనులు జీవన్ముక్తులు నగుమునీంద్రుల నభినందింప
గనుట యొక్కటియుఁ బరమేశ్వరుండు నామీఁదఁ గలపక్షపాతంబు నార
దాది యోగివరులకుఁ దెలిపి తదనురూపంబు లగుదివ్యాలాపంబు లనుగ్రహింప
నాకర్ణింపం గనుట యొక్కటియుఁ గాఁ బెక్కుకల్యాణంబులు సిద్ధించుఁ దడయక
కైలాసయాత్ర యొనర్చెద ననియె నమ్మాటలకు నమ్మానినియును సమ్మదాతిశ
యంబు నొందెఁ.120