210
హరివంశము
తే. బొలుచుతనమేనిమడఁతలఁ బొదివి శిరము, లెత్తి నిలిచి పార్శ్వంబుల నెసక మెసఁగ
ముసలసీరతాళధ్వజంబులు దనర్ప, వేడ్కతోఁ బొల్చునాభోగివిభునిఁ గనియె.190
క. ఆతనియంకతలంబునఁ, బ్రీతిం గూర్చున్నదేవుఁ బృథుమేచకజీ
మూతనిభుఁ గమలలోచనుఁ, బీతాంబరుఁ గృష్ణుఁ జక్రభృత్కరుఁ గాంచెన్.191
వ. కని భాగవతంబు లగుమంత్రంబులు జపియించుచు సహస్రనామవిఖ్యాతుం డైన
యాసహస్రావతారు నుదారసహస్రకరసహస్రసదృశవిభావిభాసమాను వాసు
దేవు దేవతారాధ్యు నాత్మమనస్సంకల్పితంబు లయిన వివిధార్చనాద్రవ్యంబుల
నవ్యాహతార్చనాతోషితుం గావించి తన్నుఁ గృతార్థుంగాఁ దలంచుచు
జలంబులు వెలువడి వచ్చి.192
ఆ. రథముమీఁద నున్న రామకేశవుల దే, హంబులందుఁ దత్సమర్పితంబు
లైనయట్టిపూజ లట్ల యుండఁగఁ జూచి, యద్భుతంబు రెట్టియై జనింప.193
వ. క్రమ్మఱ నుదకంబులోను సొచ్చి యఘమర్షణజపం బొడంగూడ నిమగ్నుం డై.194
మ. మును భోగీంద్రునియున్నతాంగమున సమ్మోదంబుతోఁ గల్పితా
సనుఁడై [1]శాంతిఁ దలిర్చునిత్యవిభుతాసంపన్ను నారోహిణీ
తనయుం దన్మహితాంకపీఠగతుఁడై తా నొప్పుశ్రీమంతు న
వ్వనజాక్షుం గనియెన్ సురాసురమునివ్రాతార్చ్యమానాత్ములన్.195
క. కని వెలుపల నరదముపైఁ, దనరెడువీ రేల యీయుదకగర్భం బిం
తనయిట్లు చెంది రిది యె, ట్లని వెండియుఁ గ్రొత్తచోద్య మాత్మకు నొలయన్.196
వ. యమునాహ్రదంబు నుత్తరించి యనుష్ఠానశేషం బనుష్ఠించి చనుదెంచి యెప్పటి
యట్ల మందరస్యందనోపరితలంబున నన్యోన్యవచనావలోకనలాలసు లై విలసిల్లు
బలదేవవాసుదేవుల నాలోకించి కదియ వచ్చినం గని కృష్ణుండు.197
మ. తడవయ్యెం జని యాప్లవంబుతఱిఁ బాతాళంబులో నీకు నే
ర్పడ నేమేనియుఁ జోద్యమైనయది దృగ్భావ్యంబుగాఁ బోలు నె
క్కుడుసంభ్రాంతి ముఖంబున న్వెలసె నక్రూరాత్మ యక్రూర నా
వుడు నాతండు వినమ్రుఁడై మధురతాభ్యుత్పన్నవాక్యంబులన్.198
వ. దేవా దేవరసన్నిధి సేయుటకంటె మిగులం జోద్యంబు లొండెయ్యవి యిక్కడ
నగ్రజసహితంబుగా నీ వి ట్లుండి ప్రసన్నుండవై యక్కడ జలనిమజ్జనకాలంబున
భవదీయసాన్నిధ్యంబు ప్రసాదించితి కృతార్ధుండ నైతిఁ గమలాసనాదులకును
నీయున్నరూ పెఱింగి వినుతింప దుర్లభంబు నే నెంతవాఁడం గేవల వాత్సల్య
నిమగ్నుండ వై యనుగ్రహింపుము.199
- ↑ కాంతి