200
హరివంశము
శ్రీకృష్ణుఁడు కేశిని మార్కొని పోరి మృతిఁబొందించుట
వ. తదీయకరతాడనధ్వానంబు సైరింపక.106
మ. ప్రళయార్కుం గబళింపఁగోరి కడుసంరంభంబుతో రాహుమం
డల మాత్రాకృతిసూపున ట్లధికచండం బైనవక్త్రంబు గ
ట్టలుకం బంతులు గానరాఁ దెఱచి దేవారాతి యావీరుపై
బలియుండై కవిసె న్నభశ్చరులు సంభ్రాంతాత్ములై చూడఁగన్.107
క. ఆగుఱ్ఱపుటసుర గడఁగు, లాగును హరి రిత్తచేతులన యున్న నిరు
ద్యోగతయుఁ జూచి కడును, ద్వేగంబున నిట్టు లనిరి వ్రే లాతనితోన్.108
క. గోవింద యిద్దురాత్ముఁడు, గేవలతురగంబు గాఁడు కేశి యనఁగ దే
వావళి కవధ్యుఁ డగువాఁ, డీవిధిఁ గంసహితుఁ డైనయింద్రారి సుమీ.109
క. మొన లేర్చి నిలిచి పలువురు, జననాథులు వీనితోడి సమరమునకుఁ గా
క నివృత్తు లైరి నీవే, మిని వేగిరపడక కదియుమీ వెర వొప్పన్.110
వ. వీఁడు పాపకర్ముండు గావున వీని చేసిన పాపంబు రూపడంచు నించుక తెలివి
వాటించి పెనంగు మని మానుషబుద్ధు లగుటం జేసి హితంబు గోరి చెప్పిన వారి
వాక్యంబులకు నొయ్యన నవ్వుచు నటుసూడుం డింక నీరక్కసు నెట్లు నేసెదనో
మీరు సంతసిల్లుపౌరుషంబులు పసరింప దొరకొనుట నాకుం బండువుగాక
యేమిభరం బేమి సేయుదు సంశయింపవలవ దనుచుం గడంగి.111
మ. అవతంసం బగుపింఛదామకము [1]వేగాక్షిప్తపద్మంబులన్
సవిశేష[2]చ్ఛవిఁ జూప హేమపటకక్ష్యాసుందరాందోళనం
బు విభాసిల్లుపిఱిందిదిక్కునకు నొప్పు ల్వెంప వక్షస్థలీ
నవలీలా వనమాల యుజ్జ్వలరుచిన్ నర్తిల్ల నద్దేవుఁడున్.112
వ. సవ్యదక్షిణమండలపరిభ్రమణంబుల మెఱయుచు నక్లేశంబునం గేశిదిక్కు దఱిమిన
నుఱక యయ్యసుర యిరుదెసలకు మొగంబు మురియించుచు గొరిజలతాఁకున
ధారుణి దళనపటుపటహతాడనానుకారి యగు దారుణారావంబు పుట్టింప
బెట్టిదంబుగా నడరె నట్టిసమయంబున హయదైత్యుండు నెగసి ముందటి
కాళ్ల రెంటను హరియురంబు దొక్కుటకై నిక్కిన నక్కుమారుం డాచక్కటి
దప్పించి యొప్పుగాఁ గ్రంగుటయుఁ బాదపాతం బొక్క పార్శ్వంబు వెంటం
జెనఁటి యై పోవం దదీయవక్త్రంబునం జెదరు ఫేనశీకరంబులు శిశిరచంద్రునిం
బొదువు హిమకణంబులకరణిం గృష్ణునాననంబుపైఁ దొరఁగె నాలోన నాలోల
కుంతలుం డగుచు నొక్కింత దొలంగి నిలిచిన జలజనయనుం బరుషరోష
రూక్షేక్షణంబులం జూచి కందంబు విదిర్చి విచ్చి నిక్కి ముక్కుపుటంబులు దటతట
నదరఁ గుటిలదానవుం డందందం గాలు ద్రవ్వి త్రుళ్లినఁ బెల్లెగయు కెంధూళి