పుట:హంసవింశతి.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము 227

సరవిఁ బ్రమోదస్థలమునఁ జెలఁగిన
ప్రద్యుమ్నునకును బ్రణతి యొనర్చుచు
సమ్మోదాఖ్యస్థలమున నుండెడు
ననిరుద్ధునకు సమారాధన మని
సత్యలోకమున సతత మ్మెనసిన
విష్ణువునకు గోవిందలు సల్పుచు
సూర్యమండలిని సొంపుగఁ బ్రబలిన
పద్మాక్షునకుఁ బ్రపత్తి వహింపుచు
క్షీరాబ్దిస్థలి శేషశయనునకు
హస్త స్వస్తిక మనుబంధింపుచు
శ్వేతద్వీప క్షితిఁ బ్రభవించిన
తారక హరికిని దండము లొసఁగుచు
రమణ బదరికారణ్యం బందలి
నారాయణునకు నమ్రత లొసఁగుచు
నైమిశ పుణ్యవనంబును బొందిన
హరికిని మంగళహారతు లెత్తుచుఁ
దనరు హరిక్షేత్రంబున నెలకొను .
సాలగ్రామస్వామి గణింపుచుఁ
బొసఁగ నయోధ్యాపురిలోఁ జెలఁగెడు
రఘునాయకునకుఁ బ్రణిపాతము లని
మధురాపురిలో మహిమలఁ జెందిన
బాలకృష్ణునకుఁ బ్రాణాచారము
మాయాస్థలిలో మధుసూదనునకు
నిరతం బల్లో నేరే ళ్లనుకొని
కాశీస్థలి భోగశయానునకును
నమరఁగ నూర్థ్వశయంబుఁ జొనుపుచును
దలఁప నవంతీస్థలిలో నవనీ
పతిదేవునకును బ్రాంజలు లిడుచును
ద్వారవతిన్ యాదవకుల భర్తకు