పుట:హంసవింశతి.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxv

కంచి చంచలాక్షులు కొఱికేవారు. చెన్నపట్నపుఁ జెలువలు బరికేవారు. వానర లక్షణములు చెప్పఁబడినవి. ఇఁక నెల్లూరి నారీమణుల వ్యాపారము నారాయణ కవికి నచ్చలేదు. పాదము ప్రియుని నుదుటఁ బెట్టుదురా? దాని కెంపు - పస పెన్నలోఁ గలియుఁగాక! అని, కర్పూర తాంబూల రసరంజితాధరసంపుటితోఁ గనుదమ్ముల మీఁద ముద్దు వెట్టించినాఁడు.

చిలుక తొలిపలుకులు

సీ. దశకంధరుని మోహదశ విచారించెనే
         సకల జగన్మాత జనకజాత
   నహుష భూపాలు మన్నన కొప్పుకొనియెనే
         స్త్రీరత్నమైన శచీపురంధ్రి
   యల సింహబలుని మాయలఁ జిక్కి చొక్కెనే
         విపుల సద్గుణమాన్య ద్రుపదకన్య
   శబరాధిపుని దురాశలకు లోనయ్యెనే
         రతినిభాకృతి భీమరాజపుత్రి

తే. తొల్లిటి మహాపతివ్రతల్ దుర్మదాంధ
    కాపురుషు లంగభవ శరాఘాత వికల
    చిత్తులై తమ్ముఁ జేరి యాచించినపుడు
    సిగ్గు వోనాడుకొనిరఁటే! చిగురుబోఁడి! (శుక. 1-155)

అంచ తొలిపలుకులు.

సీ. పంక్తికఁఠుని మోహపరితాప మెంచెనే
          భువనమాత జగత్ప్రపూత సీత
   యల పుళిందుని బొంద నాసక్తి జెందునే
          ప్రియహితామితనయ భీమతనయ
   నహుషుని విరహంపుఁ దహతహల్ చూచెనే
          సాంద్ర సద్గుణచర్య యింద్రుభార్య