ఈ పుట ఆమోదించబడ్డది
ద్వితీయాశ్వాసము
335
తడయక నచటి కందఱు నేగుటయు 2490
కురురాజు బలముల గూడి యేతెంచి
సురవైరితో బోరి సుగులెల్ల నడగి
సమరంబు చాలించి సంధి యొనర్చి
శమసునందను నాజ్ఞ సమ్మతి బూని
సకలసేసలుగూడి సామీరి కడకు 2495
ప్రకటించి చేరుట ఫల్గుణుం డపుడె
పరతెంచుటయు ధనపతినందనుండు
గరిమెతో గ్రక్కునఁ గదలివచ్చుటయు
బారులు దీర్చుట బలుదెఱంగులను
పో రొనరించుట బోరిలోపలను2500
అనిలజుం డసురేశు దర్థేశసుతుఁడు
మొనసిన మూర్చల మునిగి వేగంబె
తెలి వొంది యనిసేయ దివురుచుండుటయు
నలకాపురాధీశుఁ డావహం బగుట
నిని సైన్యములతోడ వెస నేగుదెంచి 2505
మొనసిన రిపుసైన్యముల నెల్లఁ జూచి