పుట:సకలనీతికథానిధానము.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

170

సకలనీతికథానిధానము


వ.

అట్లు గావున కాకం బర్హంబు గాదని పశు లెల్ల విచారించి గరుడనిం బట్టంబు గట్టి సుఖంబున నుండిరని చెప్పి మఱియు నొక్కకథ వినుమని తంత్రియు నిట్లనియె.

230


క.

ప్రమదమునఁ బిశాచంబులు
తమ కొక్కని రాజుఁ జేయఁదలఁచినవేళన్
గ్రమ మలర స్థూలకుక్షుం
డమరఁగ దుర్బలపిశాచ మర్హుం డనినన్.

231


క.

తను భవభీతిపిశాచం
బనియెన్ దుర్బలపిశాచ మది పతి యగునే
యనినన్ విధి దోడ్పడెనేన్
ఘనుఁడైనను హీనుఁడైన గాంతి వహించున్.

232


సీ.

గంగాఖ్యపురమునఁ గలఁడు దరిద్రుండు
        దేవదత్తుండను ద్విజవరుండు
బలహీనుఁ డతనికి భార్య లిద్దఱు గల
        రందుఁ చిన్నది తన యధిపతికిని
విధియుక్తమైనట్టి వివిధలడ్డుకములు
        మూటగట్టా[1]త్మేశు మ్రోలఁబెట్ట(?)
నతఁడు తమ్మునిఁ జూడ నరుగంగ దొంగలు
        ముసరి యాతనిచేతి మూట మెసఁగి


తే.

విషముచేఁ జచ్చుటయును నా విప్రవరుఁడు
తస్కరులజేతి శస్త్రముల్ తా ధరించి
తలలు ఖండించుకొనిపోయి ధాత్రిపతికిఁ
జూపుటయు మెచ్చి ధనము భూసురున కిచ్చి.

233


వ.

గృహంబున కనిచి సుఖం బుండు నంత.

234
  1. దుస్సంధి