పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

89


చ.

మునివరులార! మజ్జనకు ముఖ్యవిమానలస త్ప్రకాశ మా
దినకర చంద్ర పావకుల దీధితులన్ హసియించుచు న్భువిన్
ఘనతరమై నభోదిశను గన్పడుచున్నది చూతమంచు న
య్యనిమిష తాపసోత్తముల నందఱఁ బిల్చి ప్రమోదచిత్తుఁడై.

56


సీ.

అంబరమార్గాన నరిగి విమానపూ
        ర్వద్వారముసఁ జొచ్చి వనజభవుఁడు
పోవుచుండఁగఁ జూచి పురుహూతముఖసుర
        సంయము ల్దశరథచక్రవర్తి
యజుఁడు వోయిన త్రోవ నావిమానమునందుఁ
        జేరి యచ్చట విష్ణుసేవ నెంచి
యంతరాంతరములం దరుదుగా వెదకుచు
        భయభక్తు లెసఁగ నాబ్రహ్మముఖులు


తే.

వాసుదేవుని వీక్షించి వాంఛ మీఱ
మనము లుప్పొంగ నాస్థానమంటపముల
లోఁ బ్రవేశించి రప్పుడా లోకకర్త
యైన నారాయణుండు దాయార్ద్రుడగుచు.

57


వ.

క్రీడామంటపమధ్యంబున నవరత్నస్థగితపద్మపీఠంబునందుఁ
బ్రాకృత ప్రకాశుండై మఱియును.

58


సీ.

మకుటకౌస్తుభరత్నమకరకుండలములు
        ఘన మేఖ లాంగద కంకణాలు
వర వనమాలికా వైజయంతులదీప్తి
        నలరు గ్రైవేయక హారములును
కనకాంబరం బొగిఁ గాంతుల నీను దే
        హమునందు వెలుఁగగా నభయదాన