పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

49


విపినములోపల జొరబడి
చపలత నొకమార్గమందు శైలం బెక్కెన్.

170


వ.

తన్మార్గంబునందున్న కపిలతీర్థప్రముఖసప్తదశతీర్థములందు స్నానంబు చేసి
నిర్మలచిత్తుండై పర్వతారోహణంబు చేయుచుండి తన్మార్గసమీపంబున నుండు గుహా
మధ్యంబున ధ్యానయోగగరిష్ఠుండై యున్న సనత్కుమారుసన్నిధానంబు చేరి సాష్టాంగ
దండప్రణామంబు లాచరించి నిలిచి ముకుళితహస్తుండై వినుతించి యిట్లనియె.

171


క.

తాపసవర్యమహాత్మక
పాపాత్ముఁడ నైననన్ను బటుకృపతోడం
జేబట్టి బ్రోవవలయును
నీపాదమె దిక్కు నాకు నిర్మలహృదయా.

172


క.

దారిద్ర్యముచేతను సం
సారంబును విడిచి వచ్చి సరగున నిన్నే
జేరితి నాకష్టదశన్
వారించి సుఖంబు నీయవలయు మహాత్మా.

173


మ.

అనినం దాపసవర్యుఁ డిట్లనియె నీ కాయస మింకేల చే
సినపాపంబు నశించుకాల మిదె వచ్చెన్ బాప మే దంటివా
విను జన్మాంతరమందు మాధవుని సేవింపన్ వివేకంబు లే
కనులోభంబున దానకంటకుఁడవై గర్వంబుతో నిక్కుచున్.

174


గీ.

దానమిచ్చువారి దానంబుగొనువారి
ననుసరించి యొకరియం దొకరి
గసరుపుట్టునట్టి కల్లమాటలు నీవు
చెప్పి దాన హాని చేసినావు.

175