పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/466

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

459


సీ.

నను జూచి పలికె నో మునివర విజ్ఞాన
        మబ్బుటకై చతురాశ్రమములు
నడిపింపఁగావలె నాటిన జన్మజ
        న్మాంతరవాసన నంటినట్టి
సదమలవిజ్ఞాన ముదయించినప్పు డా
        శ్రమధర్మకర్మముల్ సల్ప కపుడ
పట్టైన స్వస్వరూప పరస్వరూపముల్
        దెలిసి వర్ణాశ్రమాతీతుఁ డగుట


తే.

విహితధర్మం బటంచును వీడుకొల్పె
నది మొద ల్గాఢవైరాగ్యమందుఁ బొంది
నట్టినన్ను గృహస్థుఁడ వగుమటంచు
నింతగా నిందు మీ రానతీయఁదగునె.

162


చ.

అని శుకయోగి వల్క విని యంబుజమిత్రుఁడు నవ్వి యిట్లనెన్
జనకుఁడు జ్ఞానకర్మముల సల్పుచు సర్వసమత్వ మొంది భూ
మిని బరిపాలనం బెపుడు మెచ్చఁగఁ జేయుచు నుండి బిడ్డలన్
గనినటువంటివాఁడు నిను గాఢవిరక్తిని బొందఁ జెప్పినే.

163


సీ.

హరియందు బద్మజుం డజునియందు వసిష్ఠుఁ
        డామునినాథునియందు శక్తి
శక్తియందుం బరాశరుఁ డాఘనునియందు
        వ్యాసుఁ డావ్యాసునియందు నీవు
పుట్టి విరక్తిని బొంది యూరకపోక
        పుణ్యాత్ముఁ డైనట్టి పుత్త్రు నొకని