పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

157


నొప్పు మణిపూరకము నాభి నుండు విష్ణుఁ
డచటఁ దా స్థితికర్తయై యలరుచుండు.

103


సీ.

పదియంగుళములకుఁ బై హృదయస్థాన
        మం దనాహతపద్మ మమరుచుండు
ఠాంతవర్ణంబు లుండఁగ పదిరెండైన
        దళములచే నొప్పు దానియందు
నధికుఁడై లయకర్త యైనరుద్రుం డుండు
        నావలఁ బదియు రెండంగుళముల
పై విశుద్ధంబుండు భావింప కంఠంబు
        నందున నాల్గుపదాఱుదళము


తే.

లందు వెలుఁగు సదాశివుం డచట నుండు
దానిమీఁదట నాజ్ఞాభిధానచక్ర
మున హకారక్షకారంబు లొనరు నచట
నున్నతంబుగఁ బరమాత్మ యొప్పుచుండు.

104


సీ.

అట దానిపైన సహస్రారకమలంబు
        శీర్షంబునందు భాసిల్లుచుండు
నది యమృతస్థాన మగు దేహవృక్షంబు
        నకు మూలమై గురునకు నివాస
మగు నిడాపింగళలం దేకవింశతి
        సాహస్రములు మఱి షట్ఛతంబు
లైనశ్వాసములు ప్రాణాపానకలితంబు
        లై హంసలై యజపాఖ్యనొందు


తే.

నట్టిశ్వాసలు గణపతి కాఱునూఱు
జలజసంభవ విష్ణురుద్రులకు సంఖ్య