పుట:శ్రీరంగమాహాత్మ్యము.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

శ్రీరంగమాహాత్మ్యము

      మీరు పాలాశతీర్థంబు దక్షిణమున, దెలియు మవనీసురాశనతీర్థ మొప్పు
      నాగు పశ్చిమదిశను పున్నాగతీర్థ, మవియె నన తీర్థములు రంగభవనమునకు.
క. ఈమేరఁ తీర్థములలో, శ్రీమత్పుష్కరిణి సర్వశేఖరమగుచున్
      దా మనుజుల తాపత్రయ, నామాదివ్యాధు లణఁచు నరవరతిలకా.
క. యోగులు భాగవతులు నిజ, యోగానలదగ్ధకర్ము లుందు రిచటఁ బు
      న్నాగం బనుతీర్థము పు, న్నాగరజచ్ఛాయఁ గాంచనప్రభ లీలన్.
సీ. భార్గవమౌని తపంబుచే నుతికెక్కె కీర్తిఁ గైకొనియె సుకీర్తి విభుఁడు
      తారకుఁడఁహ్వో నివారకుఁడై పొల్చి మిథిలాపతి మనోవ్యథ లడంచె
      రుగ్మదృష్టిశరీరరోగముల్ దొలఁగించె కాశ్యపమౌని విఖ్యాతిఁ గాంచె
      నగజాధిపతి బ్రహ్మహత్యబొ కడబెట్టె పూనిషణ్ముఖుఁడు సేనానియయ్యె
      పుష్కరిణితక్కఁ దక్కిన బుణ్యతీర్థ, రాజములందు మొదటిపర్యాయములును
      వకుళతీర్థంబుతో మునివ్రాతమెల్లఁ, దీర్థములు తొమ్మిదనుచుఁ గీర్తింపుచుండె.
గీ. తీర్థనాధారణముగఁ గీర్తింపనగునె, చంద్రపుష్కరిణి మహాసరసిఁ గాన
      వేరె నవతీర్థముల్ నదుల్ వెండిసేయు, నేకవారాప్లవనమయహేతుకంబు.
క. ఇందులను బిల్వతీర్థ మ, మందమహామహిమములును మహనీయంబై
      యిందును నందును కోరిక, లొందించు నృపాల దీని, నొకకథ వినుమా.
సీ. అనుచు మార్కండేయుఁ డనియె తొల్లి యవంతిజనపతి జనరథుం డనెడురాజు
      కాంపిల్యపురము పాలింపుచు నతని ప్రధానులు పాషండు లైనకతన
      నన్యాయముల కోర్చి యాగడంబులు చేసి యన్యదారాదుల నపహరించి
      నగరును దిక్కు గానక మహీశుఁడు వారు జెప్పినట్టులు సేయు తప్పుకతన
      పోయె వానలు పంట లేదాయె భువిని, హెచ్చె చోరాదిబాధలు విచ్చె పుణ్య
      మెదిరె పాపంబు వ్యాధులు ముదిరె ప్రజకు, నుడిగె పాడియు శుభక్రియ లడఁగె నపుడు.
క. ఆయెడ ధరణీసురలు ప, లాయితులై పఱచి దోర్బలస్యబలారా
      జా యనుట లేమి తమర, న్యాయమనుచు ధరణీసురలు నరచుచుఁ బోవన్.
ఉ. ఆనరనాథు రాజ్యము ననధ్యయనంబులు లేక యాగసం
      తానము బీజమాత్రమయి నాకనుపించక ముఖ్యధర్మముల్
      దానము ధర్మమున్ వ్రతవితానము నిర్వచనీయమై జనుల్
      మైనవదండివెతల సమస్తశుభేతరులై చరింపఁగన్.
గీ. క్షుద్రాభూయిష్టమై యతిక్షుద్రకర్మ, ములను వర్ణాశ్రమంబులు గలిసి వావి
      వర్తనలులేక ప్రజలెల్ల వర్తిలంగ, నట్టిపాపంబు భూపాలుఁ జుట్టుకొనియె.