పుట:మత్స్యపురాణము.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మత్స్యపురాణము

133


వ.

అని యివ్విధంబున సుగంధి పల్కిన ప్రియవచనంబులకు సంతసించి భూ
సురుం డిట్లనియె.

15


గీ.

తల్లిమాడ్కి నీవు దయతోడఁ బల్క నా
యలయికెల్లఁ దీఱె నంబుజాక్షి
యతిథి పుత్త్రభావ్యుఁ డను శాస్త్ర మిచ్చటఁ
బ్రకటమయ్యె నేఁడు పద్మవదన.

16


క.

శ్రీకాంతుని దివసము నేఁ
డేకాదశి యీదినమున నేవరుఁ డైనం
జేకొని భుజియించిన వృజి
నాకరుఁడై నరకలోకమందు వసించున్.

17


గీ.

ఈమహావ్రతంబు నెవ్వారలైనను
జలుపఁగలిగిరేని సర్వమైన
వాంఛితముల గలుగు వారికెల్లను బంక
జాక్షుకరుణచేత నభినుతింప.

18


గీ.

నేఁటి కుపవసించి నీగృహంబున నిల్చి
పుండరీకనయనుఁ బూజ సేసి
బారనందువేడ్క ఫలరూపపారణ
చేసి చనెడువాఁడఁ జిత్త మలర.

19


వ.

అని విప్రుండు పల్కిన వనితాలలామ యిట్లనియె.

20


క.

ధరణీసురేంద్ర! మాకును
గురువవు దయచేసి నీకు గోచరమగు శ్రీ
హరివాసరవ్రతక్రమ
మురవడి వినిపింపవలయు నొదవెడు వేడ్కన్.

21


వ.

అని వినయంబునఁ బల్కిన సుగంధికి విప్రవరుం డిట్లనియె.

22


సీ.

సర్వతీర్థస్నానసంభవఫలదంబు
        తర్కింప వాంఛితార్థప్రదంబు
సకలసంపదలకు సదనంబు వైభవా
        కరము దుష్కర్మౌఘఘాతుకంబు
బ్రహ్మహత్యాదిపాపఘ్నము బహురోగ