పుట:కాశీఖండము.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 63

బిది దేవపూజ యిది పతి
యుదితం బాలంబు సేయకుండుట సతికిన్.77

క. కాంతుఁడు సంతోషించిన
సంతోషింపంగవలయు సతి కతఁ డాత్మన్
సంతాపించినపట్టున
సంతాపింపంగవలయు జలజేక్షణకున్. 78

వ. కొందఱు కులటలు పతి దురవస్థఁ బొందినఁ దెవులుపడిన శృంఖలాబద్ధుం డైనను బరిత్యజింతురు. కొందఱు దుష్టమతులగుసతులు లేమిం గొతుకువడినభర్త నధికకార్పణ్యంబు పచరించి సర్పిర్లవణతైలతండులాదులకై సిబ్బితి వఱుతురు. కొంద ఱిచ్ఛావతులు ప్రియుండు దమకు నేమి యిచ్చిన మెచ్చట హెచ్చు కుందాడుదురు. కొందఱు పరాకు లే కేకాకినులై మగని మొఱఁగి యొక్కడికేనియుం జనుదురు. కొందఱు దుశ్శీల లశ్లీలవాక్యంబుల నందందఁ బ్రియునిముందట మందెమేలంబునం బ్రేలుదురు. ఇందఱు నాథునిం గులంబువారిని నరకంబునం ద్రోచి తారును నంద కూలుదురు. 79

సీ. చీఁకటితప్పు చేసిన సరోరుహనేత్ర
గూబ యై చరియించుఁ గోటరమున
వింతవానిఁ గటాక్షవీక్షణంబునఁ జూచు
కిసలయోష్టి వహించు గిల్లకన్ను
మగఁడు దన్మొత్తిన మార్మోత్తునలివేణి
వ్యాఘ్రియై చరియించు వనములోనఁ
జిఱుదిండి తనవారి మొఱఁగి యాహారించు
నతివ సూకరజాతియందుఁ బుట్టు