పుట:కాశీఖండము.pdf/489

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

477


తే.

కాశి నుండంగ నర్హుండు గాఁడు వీఁడు
వెడలి పొ మ్మను మాటలు వేయు నేల?
క్రోధసుం డెట్లు? కైవల్యకులగృహంబు
నానివాసంబు కాశికానగర మెట్లు!

197


వ.

అని విరూపాక్షుండు రూక్షాక్షరంబుల (దన్ను)నధిక్షేపించి పలికినం గలంగి వడవడ వడంకుచు వేదవ్యాసుం డయ్యాదిమదంపతులపాదారవిందంబులకుం బ్రణమిల్లి యేనపరాధంబు సేసితిఁ గోపం బుపసంహరింపవలయు నని ప్రార్థించిన.

198


సీ.

కాశికాపురిఁ దొంటికట్టడ నుండక
        పుణ్యకాలమునందు భూతతిథుల
వచ్చువాఁడవు శిష్యవర్గంబు నీవును
        నైదుక్రోశములకు నవలినేల
నుండువాఁడవు పైఁడికుండలు ప్రాకార
        వలయంబుఁ బొడగానవచ్చుచోటఁ
ద క్కన్యతిథులఁ దీర్థముల నిందింపకు
        బుద్ధిమంతుడవు గాఁ బొమ్ము బ్రదుకు


తే.

మంచు నంతర్హితుం డయ్యె నగజతోడ
విశ్వనాథుండు మునియును విశ్వభర్త
యాన తిచ్చినచోటనే యధివసించె
గాశికాపురి కెడదవ్వు కలుగునడవి.

199


తే.

అనిన విని కుంభసంభవుఁ డాదరమున
నాంబికేయున కభివాదనంబు సేసి
కాశిఁ గలతీర్థములును లింగములు నాకు
నాన తిమ్మని ప్రార్థించి యడుగుటయును.

200