పుట:కాశీఖండము.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

221


తే.

హరునితోడ విరోధించి యంధకుండు
యుద్ధ మొనరించు చొక్కనాఁ డోహటించె
నజగవోన్ముక్తఘననిశాతార్ధచంద్ర
బాణనిర్భిన్నవక్షఃప్రపాతుఁ డగుచు.

235


వ.

కాలకంధరునకు నంధకాసురునకు నైన యమ్మహాయుద్ధంబున నీల్గిన రాక్షసులను మృతసంజీవనీవిద్యాప్రభావంబున భార్గవుండు బ్రతికించుచుండ దండనికుంభకుంభోదరప్రముఖు లగు పారిషదులు పరమేశ్వరున కి ట్లనిరి.

236


సీ.

దేవ! మహాదేవ! త్రిపురదైత్యధ్వంస!
        యభవ! మావిన్నప మవధరింపు
మీచేత బడసిన మృతజీవనీవిద్య
        బ్రతికించుచున్నాఁడు భార్గవుండు
దైత్యవర్గము నెవ్విధంబున మా కెట్లు
        జయము సిద్ధించు? నాఁ జంద్రమౌళి
నందికేశ్వరుఁ బంచి బందిగ్రహణలీల
        గావ్యుఁ దెప్పించి శ్రీకంధరుండు


తే.

గరతలమునఁ బరిపాండుకాంతి నతనిఁ
దాల్చి దధితోడిచలిదిముద్దయును బోలె
విషము మ్రింగినపెన్నుద్ది వేల్పుఱేఁడు
మనసిజారాతి మ్రింగి గఱ్ఱనఁగఁ ద్రేఁపె.

237


వ.

అంధకాసురుండును భార్గవుండు లేని పిమ్మటం కొంతకాలంబునకుఁ గృతాంతమర్దనుచేత హతుండయ్యె. బహుకాలంబు కాలకంఠుజఠరగోళంబునం దుండి కావ్యుండును.

238


మ.

స్రవియించెన్ దుహినాంశుశేఖరుని మేఢ్రద్వారమార్గంబునన్