పుట:కాశీఖండము.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

231

శ్రీకాశీఖండము


డును దండ్రియనుమతి వడసి కాశి కరిగి బుధేశ్వరుం డనుశివలింగంబుఁ బ్రతిష్ఠించి పెద్దకాలంబు తపంబు చేసి యాబుధేశ్వరలింగంబునందు సాక్షాత్కరించిన విరూపాక్షుం బ్రస్తుతించి యమ్మహేశ్వరువలన నక్షత్రలోకంబునకు నూర్ధ్వంబున నున్నలోకంబున కధీశ్వరుం డయ్యె.

230


తే.

చంద్రకుండచంద్రేశ్వరస్థానమునకుఁ
బ్రాగ్దిశాభాగమునయందు భక్తి నరుఁడు
కాశికాక్షేత్రసీమ బుధేశుఁ గొలిచి
పరమబోధంబు దప్పఁడు ప్రాణవిరతి.

231


తే.

అనుచు గోవిందకింకరు లనఘమతులు
బుధునికథ చెప్పుచుండ నభోంతరమున
బోయె దివ్యవిమానంబు పుణ్యకర్మ
కరులనెల వైన శుక్రలోకంబు డాయ.

232


శుక్రలోకవర్ణనము

వ.

అప్పు డయ్యిద్దఱు శివశర్మ కి ట్లనిరి. నిశితశతక్రతుప్రయోగప్రక్రియాక్రమసమర్థశుక్రలోకం బిది. ఇందు దానవగురుండు గావ్యుం డధివసియించు. ఆభార్గవుండు భర్గువలన వర్షసహస్రంబు కణధూమం బాహారంబుగా దుస్సహం బైన తపం బాచరించి మృతసంజీవనీవిద్యారహస్యంబును సకీలకంబుగా నెఱింగినాఁడు.

233


తే.

ఎఱుఁగ రీవిద్య యెవ్వార లిజ్జగమున
బ్రహవంశాగ్రగణ్య! వాక్పతి మొదలుగ
గుహుఁడు దక్కంగఁ గరటివక్త్రుండు దక్క
బార్వతీదేవి దక్కంగ భవుఁడు దక్క.

234