పుట:కాశీఖండము.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

219


యాలి నిప్పించె నయ్యుపాధ్యాయునకును.

223


చ.

అమృతమయుండు గావున సుధాంశునితోడిసమాగమంబునన్
రమణి కశుద్ధి లేగనుచు బ్రహ్మరీశులు సంఘటింపఁగా
నమరగురుండు గైకొనియె నంబుజలోచనఁ దారఁ దారకా
రమణముఖిం ద్యజించె నుడురాజును భామిని నెట్టకేలకున్.

224


వ.

అనంతరంబ గర్భం బాలోకించి గురుండు దాని కి ట్లనియె.

225


తే.

అతివ! యీగర్భ మెవ్వరి కైతి చెపుమ
చంద్రునికొ? నాకొ? యని రహస్యమున నడిగె
సిగ్గుపడి యెంత యడిగినఁ జెప్పదయ్యె
నాంగిరసునకుఁ దారఁ తారాధిపాస్య.

226


తే.

చెప్పకున్నను గోపించి యిషిక యెత్తి
చూలు గరఁగంగ వైవంగఁ జూచె గురుఁడు
వేల్పు లాయిందుముఖిఁ జీరి వెఱక చెప్పు
నిజము చెప్పిన నీకు నేనెగులు లేదు.

227


ఉ.

నావుడు తార యొక్కవచనంబును బల్కక యూరకుండె ల
జ్జావనితాస్య యై సరసిజాసనుఁ డప్పుడు నేర వచ్చి యో
దేవి! నిజంబు చెప్పు హిమదీధితిసంగతి నైన గర్భమో?
జీవుఁడు దొంటికాలమునఁ జేసినగర్భమొ? యంచుఁ బల్కినన్.

228


తే.

తోయజదళాయతాక్షి కేల్దోయి మోడ్చి
పలికె నెత్తమ్మిచూలితోఁ బ్రస్ఫుటముగ
వనజసంభవ, తారకావల్లభుండు
చూలుచేసినవాఁ డంచు సూక్ష్మఫణితి.

229


వ.

గురుండును దారకు జన్మించిన కుమారునిం జంద్రుని కిచ్చె. చంద్రుండు నిజనందనునకు బుధుం డను పేరు వెట్టె. బుధుం