పుట:కాశీఖండము.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

218

శ్రీకాశీఖండము


వ.

అప్పుడు.

219


శా.

చండీశుం బొదవె న్నిశాకరుఁ డవష్టంభంబు జృంభింప బ్ర
హ్మాండక్రోడము శింజినీధ్వనులతో నాఘూర్ణతంబొంద ను
చ్చండాటోపభుజావలేపకలనాసంరంభవక్రీభవ
ద్గాండీవప్రవిముక్తభీషణమహాకాండప్రకాండంబులన్.

220


వ.

ఇవ్విధంబునఁ బ్రతిఘటించి గెంటింపరాని మగంటిమిం బెచ్చుపెరిగి కలువలనెచ్చెలి చిచ్చులుమియు శిలీముఖంబు లొడలఁ గ్రుచ్చి యార్చి శంఖంబు పూరించి సింహనాదంబు చేసి గాండీవజ్యారావంబు రోదసీకుహరంబు నిండ విధుండు దండమహాకాళనికుంభకుంభోదరవీరభద్రాదిప్రమథవర్గంబుతోడం గూడఁ దన్ను నొప్పించినం గోపించి కించిదారజ్యమానలోచనాంచలుండై లలాటలోచనుండు పురనిశాటతాటంకినీకపోలకస్తూరికా(కరి)మకరికాముద్రాద్రోహియు, జలంధరహృదయగర్వసర్వంకషంబును, సింధురాసురశిరఃకూటపాకళంబును, దక్షాధ్వరమృగధ్వంసనక్రీడానృశంసంబును, దుషారగిరికన్యకాభ్రూవల్లీవిలాసరేఖాలలితశృంగంబును నగు నజగవంబున బ్రహ్మశిరోనామకంబైన దివ్యాస్త్రంబు సంధించిన.

221


శా.

ఆకంపించె జగత్త్రయంబు దెస లల్లాడెన సముద్రంబు లు
ద్రేకించెన్ భయమందె భూతలము భేదిల్లెన్ గులక్ష్మాధ్రముల్
శ్రీకంఠుం డవికుంఠవిక్రమమునన్ దివ్యాస్త్రముం గూర్చి వి
ల్లాకర్ణాంతముగా వెసం దివిచి శీతాంశు న్నిరీక్షించినన్.

222


తే.

అప్పు డడ్డంబు సొచ్చి పద్మాసనుండు
ప్రమథనాథునిరోషసంభ్రమము మాన్పి
చంద్రునికి బుద్ధిఁ జెప్పి మాత్సర్య ముడిపి