పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉపన్యాసము 2020-21.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

'ధర్మం, సత్యం నిదానంగా పెరుగుతాయి.... బలపడతాయి.
సమాజానికి మేలు చేస్తాయి.
కానీ ఆధర్మం, అసత్యం అతి వేగంగా పెరుగుతాయి.
 చివరకు పతనమవుతాయి'

ఈ సందర్భంగా గురుదేవులు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అడుగుజాడల్లో వారి వాక్యాల స్ఫూర్తితో నేను నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.

ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో,
ఎక్కడ శిరస్సు సగర్వంగా తల ఎత్తుకుని నిలబడుతుందో,
ఎక్కడ జ్ఞానం స్వేచ్ఛగా ఉంటుందో,
ఎక్కడ ఆరోగ్యం అన్నిటికన్నా ముఖ్యమో,
ఎక్కడ సమాజం శకలాలుగా విడిపోదో,
ఎక్కడ స్త్రీలు శిశువులు సాధికారికంగా నిలబడతారో,
ఎక్కడ ఉద్యోగ అవకాశాలు పుష్కలమో,
ఎక్కడ నిర్విరామ ప్రయత్నమే ఒక జీవన విధానమో,
ఎక్కడ రైతన్నలు కృషి కొనసాగిస్తారో,
ఎక్కడ గ్రామాల్లో స్వరాజ్యం సిద్ధిస్తుందో,
ఎక్కడ నేను అనే ఇరుకు పదం కన్నా మనం అనే విశాల పదం ముఖ్యమౌతుందో
అక్కడికి,ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి
నా తండ్రీ, నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మేల్కొల్పు!

ఈ మాటలతో నేను నా బడ్జెటు ప్రతిపాదనలను గౌరవ సభా సదుల ఆమోదానికి సమర్పిస్తున్నాను.

జై ఆంధ్రప్రదేశ్

జై హింద్.