పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

94


గారికి సంభవించిన యా యకాండ విషత్తును మనివి చేసికొని నాడు. సదరమీనుగారును దిగ్భమ జెంది ఉక్కిరి బిక్కిరిగా పరుగెత్తు కొనివచ్చి కొత్వాలుగారి బంగ్లా తలుపు తట్టినారు. కొత్వాలుగారు తలుపు తెరచినారు. సదరమీను గారు తనతో జవాను చెప్పిన వార్త తెలిపినారు. - కొత్వాలు గారదంతయు పొరపాటనియు, తాము ఇంగ్లీషు పాఠమును నేర్చుకొనుచుం టిమనియు, జవానుయొక్క నిర్ణయమును గురించి కొంత సేపు ముచ్చటించుకొని తమలో తాము నవ్వు కొనిరి. ఇట్లు వీరు ఇంగ్లీషు విద్యాభ్యాసము అతి శ్రద్ధతో చేసినారు. తప్పులో ఒప్పులో మాట్లాడుటకును మాట్లాడిన మాటలు అర్థము చేసి కొనుటకును నేర్చుకొనినారు.


వేల్సు యువరాజు గారు హైద్రాబాదునకు రానుండిరి. కాని ఒక చిక్కు సంభవించను. వారు నాలుగు గుర్రాలబడ్డీ లోనే ఊరేగింపు వెళ్ళదలచి నామని తెలిపినారు. భారత దేశము లోని ఆందోళనములను దిన దినమును వినుచున్నందున హైద్రాబాదు ప్రభుత్వమువారు వారిని బగ్గీలో తీసికొని పోవుట ఉచితము కాదనియు మోటారులోనే తీసికొని పోవలె సనియు నిర్ణయించినారు. కాని వేల్సు యువరాజుగారు పట్టిన పట్టు వదలు స్వభావము లేని వారని అప్పుడే కాదు తర్వాత కూడ సామ్రాజ్య పీఠమునే వదలి నిరూపించినారు. అప్పుడు