శ్రీ వేంకటేశ్వర వచనములు
55
వినిపింప నెవ్వరితరము? మీరె కరుణించినప్పుడు మధురమయ్యెడుఁగాక! శ్రీ వేంక టేశ్వరా !
122
సామగానప్రియా ! లోకరక్షణార్థంబు నీ వవధరించిన రామకృష్ణావతారంబులను కర్మపాశబద్దులై నవారు తమసాటిగాఁ దలఁతురు. వారు మీతో సరి యేల యయ్యెదరు ? సర్వోత్కృష్టుండవని యెఱుఁ గనివారికదియేల రుచియించును? సర్పదష్టులై నవారి కేమి దినినఁజప్ప నుండినట్లు మాయాసర్పములు తల కెక్కిన తమ్ముతామేఱుంగక నిన్నుఁ దమసాటి కెంచుకొంచున్నారు. కటకటా! యేమి యందు. సకలరక్ష కుండవని మహాపురుషులు నిన్నుఁగూర్చి తపంబులు సేసి మహ త్వంబులు వొందుచున్నారు. మాఘనత కిదియె దృష్టాంతంబని యెంచఁదగును; శ్రీ వేంకటేశ్వరా !
123
శ్రీ వత్సలాంఛనా ! నీవు బలవంతుండవు. ఎట్లు చేసిన నట్లగు. గౌతమీ నది జలంబులకుం దగిలినశాపంబు పరిహరింప శబరిస్నానతీర్ధంబు గారణంబు చేసితివి. ఇదేమిచిత్రమో? బ్రహ్మర్షి యైన దుర్వాసు నాపద మాంప నీభక్తుండైన యంబరీషుని గుఱి చేసితివి. హీనాధిక్వంబులు విచారించిన నెంత కెంత యంతరము! మీదాసులప్రభావంబు లిట్టివని లోకులకుం దెలిపితివి. 'ఏమని నుతియింతుము నీమహిమ ! శ్రీ వేంక టేశ్వరా !
124
తాటకాంతకా ! నేను రాజస తామసగుణంబులం దగిలి మదోన్మతుం డనై యున్న వాఁడ; నే బుద్ధిమంతుండ నౌటయెన్నఁడు ? పూర్వజన్మం బున నే ననుభవించిన సుఖదుఃఖంబులు దలంచియైనను, గొంత చక్క'టికి వచ్చెదనంటినేని, జాతిస్మరత్వంబు లేదు. నరక బాధలఁ దలఁచుకొని యెదనంటినేని నవి నాఁడె మఱచితిని. భువిలోపల శునక సూకరాదులను సంసార బాధలం బడెడివారి తర్జనభర్జనాదులుచూచి విరక్తుండనయ్యెద