పుట:Shodashakumaara-charitramu.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

షోడశకుమారచరిత్రము


క.

ఆవనితకు ముసుఁ గిడి చని
యావలిమందిరముఁ జొచ్చి యందును నొకవ
స్త్రావృతరూపము పొడగని
యావరణము వుచ్చి చూడ నాశ్చర్యముగన్.

145


వ.

పరోపకారిభూపాలనందనరూపం బగుటయు నాపోవక కనుంగొని విస్మయంబుఁ బొంది యరసి మున్ను పొడగన్న యన్నాతులయట్ల యగుటం దెలిసి యుల్లంబు జల్లన మూర్ఛిల్లి యెంతయుం దడవునకుం గొంతతెలివిం బొంది.

146


శా.

ఈవామాక్షి సముద్రముం గడచి యెట్లేతెంచెనో వచ్చెఁబో
చావంగాఁ గత మేమి ఖేచరజనస్థానంబునన్ దీనికై
చావు న్నోవును నొందుపాటువడి బల్చందంబులం జేరితిన్
దైవంబా యిటు లేల చేసితివి తంత్రంబో మరుంజంత్రమో[1].

147


వ.

అని దైవంబు దూఱి యవ్వామనయన నుద్దేశించి.

148


సీ.

తరుణి నీకుచపర్వతము లెక్కఁగాఁ గోరి
        దారుణోన్నతపర్వతంబు లెక్కి
మగువ నీముఖచంద్రమండలాగృతిఁ జూడఁ
        దమకించి బహుమండలములు చూచి
యంగన నిన్ను రాగాబ్ధి ముంపఁ దలంచి
        యతి దుష్కరం బైనయబ్ధి మునిగి
జలజాక్షి నినుఁ జూపువలఁ దగుల్పఁగఁ బూని
        పలుపాటు లను విధివలలఁ దగిలి
కనకపురము గాంచి కడుఁ బ్రమోదము నొంది
నిన్నుఁ జూతు ననుచు నున్నచోట

  1. చేశితిది నితంత్రంబ్బొమరుంజ్జంత్రమో- మూ.