సి. | విషముఁ జూచిన వేళ విషయుక్త మైన | |
గీ. | నిందు నొక్కటిచేనైన నెందు లెస్స | |
ప్రాఁతకామందకమున "లలిఁ జకోరములకన్నులు విరాగము లగు" ననుచోట “చకోరస్య విరజ్యేతే నయనే" యనుటకు రెండవకవి మరాళస్య యని పఠించుకొనియె.
287వ పద్యమునకు సరిగా రెండవకామందకమున—
సీ. | భార్యయింటికిఁ జని భద్రసేనుఁడు తొల్లి యామెతోఁబుట్టుచే హతుఁ డగుటయు | |
గీ. | యటు కరాళాంజనము పూసి యద్ద మందె | |
అని చెప్పుటలో భద్రసేనుఁడు తనబావమఱఁదిచేఁ జంపఁబడె ననియు, కరాళాంజనము పూసిన యద్దమును, అందెయు, మొలనూలును బ్రయోగించి క్రమముగా జారూప్య వైరూప్య సౌవీరరాజులఁ దమతమభార్యలు చంపిరని రాజులకు దేవీగృహగమనము కవి నిషేధించుచున్నాడు. ప్రాచీనకామందకమున భద్రసేనుఁడు