పుట:Rajayogasaramu.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

34

రా జ యో గ సా ర ము

నెలవుగ నౌ త్రివేణీసంగమమున
జలకంబు లాడి విశ్రాంతివహించి
వెలిప్రపంచంబును విడిచి యాలోన
నిలిచి చూచెడితెల్వి నే నని నిజము
నరసిన బ్రహ్మవిద్యాధురంధరులు
దొరఁకొని కాయసిద్ధులు గోరఁబోరు
నూరక సంసారయుక్తులై యుండి
ధారాళముగఁ దమ్ముఁ దాము చూచుకొని
జలజపత్రంబులో జలముచందాన
నలరి సంసారమునం దంట కెప్పు
డుండుధన్యులు సిద్ధయోగులు గాక
ఖండవిద్యలు నేర్చి గర్వంబు మించి
స్తంభనమోహనోచ్చాటనమంత్ర
జృంభణంబులు సూపి చెలఁగెడువారు
పవనయోగము నేర్చి పటుయుక్తిఁ బెంచి
యవిరళంబుగఁ దటాకాంతరమందు
మహిమఁ జూపుటకుఁ బద్మాసనంబునను
సహజంబుగా నుండి జనుల మెప్పించి
బద్ధులై యంతకుఁ బరమైన యోగ
సిద్దాంత మెఱుఁగక చెడిపోవువారు
కడుపునిండఁగ నుదకంబును బీల్చి
కడుపున మలమెల్లఁ గడగి శోధించి